ఒకప్పుడు టాలీవుడ్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలు రూపొందించిన నిర్మాతల్లో బెల్లంకొండ సురేశ్ ఒకరు. ఇప్పుడాయన సినిమాలు నిర్మించడం లేదు కానీ, తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ను హీరోగా నిలబెట్టేందుకు శాయ శక్తులా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కొంతమేర సక్సెస్ అయ్యారు. ఇప్పుడు రెండో తనయుడు గణేశ్ ను తెరకు పరిచయం చేసే ప్రయత్నంలో ఉన్నారు.
నిజానికి బెల్లంకొండ గణేశ్ హీరోగా ఒక సినిమా ను ప్రారంభించారు. ఆల్రెడీ ఒక షెడ్యూల్ ను కూడా కంప్లీట్ చేశారు. అయితే ఏవో కారణాలతో ఆ సినిమా అర్ధంతరంగా ఆగిపోయింది. ఇప్పుడు మరో సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పదిహేనేళ్ళ క్రితం బాలీవుడ్ లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘వివాహ్’ ను తెలుగులో రీమేక్ చేయబోతున్నారని సమాచారం. గణేశ్ కోసం సురేశ్ ఆ సినిమా రైట్స్ తీసుకున్నారట.
బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ ఫ్యామిలీ మూవీస్ తెరకెక్కించిన సూరజ్ భరజాత్య దర్శకత్వంలో రూపొందిన ‘వివాహ్’ లో.. షాహిద్ కపూర్, అమృతారావు జంటగా నటించారు. అప్పట్లో ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇప్పుడీ సినిమాను తెలుగులో కొన్ని మార్పులతో రీమేక్ చేయబోతున్నారు. ఇక ఇందులో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి కథానాయికగా నటిస్తోందట. దీనికి దర్శకుడు ఎవరు అనే విషయంలో ఇంకా క్లారిటీలేదు. ఈ ఏడాది చివర సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్ళబోతున్నరని సమాచారం. మరి ఈ సినిమా గణేశ్ కు మంచి పేరు తెస్తుందని ఆశిద్దాం.
Must Read ;- రాజశేఖర్ తనయ, తమిళనాడు సి.యం తనయుడు జోడీ ఇంతకీ ఏ సినిమా?