ఇజ్రాయెల్ ఆర్మీకి-పాలస్తీనా అతివాద హమాస్ గ్రూపు మధ్య పోరు అంతకంతకూ తీవ్రరూపం దాల్చుతోంది.గత వారం రోజులుగా జరుగుతున్నఈ ఘర్షణల్లో దాదాపు 139 మంది చనిపోయినట్టు భావిస్తున్నారు.వివాదాస్పద ప్రాంతానికి సంబంధించి తొలుత హమాస్ ఉగ్రవాద దళాలు ఇజ్రాయెల్ ఆధీనంలోని ప్రాంతాలపై వందలాది రాకెట్ లాంఛర్లతో దాడులు చేయడంతో ఇజ్రాయెల్ వైమానిక దళం రంగంలోకి దిగింది.దాదాపు 50 యుద్ధ విమానాలు హమాస్ కార్యాలయాలు,మద్దతు దారుల భవనాలు,అనుమానిత భవనాలపై, హమాస్ అనుకూల మీడియా సంస్థల కార్యాలయాలపై బాంబులు వేశాయి.ఈ బాంబు దాడులతో పలు అంతర్జాతీయ కార్యాలయాలు కూడా ధ్వంసమయ్యాయి.అమెరికాకు చెందిన అసోసియేటెడ్ ప్రెస్,అల్ జజీరా,సీజీఎన్ కార్యాలయాలు ఉన్నాయి. అయితే ఆ 12 అంతస్థుల భవన యజమానికి ఆశ్చర్యకరంగా ఇజ్రాయెల్ మిలిటరీ హెచ్చరికలు జారీచేసి కాసేపటి తరువాత బాంబులు వేసింది.ఒకవేళ సమాచారం ఇవ్వని పక్షంలో భారీగా ప్రాణనష్టం జరిగి ఉండేది.ఈ ఘర్షణల నేపథ్యంలో ప్రాణాలు కోల్పోయిన కేరళ మహిళ సౌమ్య సంతోష్ భౌతికకాయం శనివారం ధిల్లీకి చేరకుంది.క్రమేణా ఇజ్రాయెల్ మిలిటరీ 18వేల మందిని ఈ ప్రాంతంవైపు తరలిస్తుండడంతో రానున్న కాలంలో ఈ పోరు మరింత తీవ్రం అవుతుందని అంచనాలున్నాయి.ఇక ఇజ్రాయెల్- హమాస్ మధ్య వివాదం విషయానికి వస్తే పాలస్తీనాని కూడా కలపాల్సి ఉంటుంది.
రెండో ప్రపంచ యుద్ధం తరువాత స్వాతంత్యం
బ్రిటీషు పాలనలోని కొన్ని ప్రాంతాలకు రెండో ప్రపంచ యుద్ధం తరువాత స్వాతంత్యం వచ్చింది.అప్పటికే బ్రిటన్ పాలనలోని ప్రాంతాల్లో యూదులకు ప్రత్యేక ప్రాంతం ఉండాలని పోరాటం జరుగుతోంది.అంతకుముందు పలు చక్రవర్తుల కాలం నుంచి,శతాబ్దాల క్రితం నుంచి ఈ పోరాటం జరుగుతూనే ఉంది.ఈ క్రమంలో ఓ ప్రాంతం విషయంలో యూదులకు, ముస్లింలకు మధ్య పవిత్ర ప్రాంతం విషయంలో హక్కుల పోరాటం మొదలైంది.అదే జరూసలేం.యూదుల దేశమైన ఇజ్రాయెల్కు జోర్డాన్,పాలస్తీనాతో వివాదం నెలకొంది.యూదులకు, ముస్లింలకు పవిత్ర ప్రదేశం కావడమే ఈ వివాదం పెరిగేందుకు కారణమైంది.అయితే వివాదం తలెత్తిన సమయానికి ఇజ్రాయెల్ (ఆ పేరు లేదు) అప్పటి వరకు సర్వ స్వతంత్రంగా ఉండేది కాదు.1847 మే 15న పూర్తిస్థాయిలో స్వతంత్ర పాలన పరిధి ప్రతిపాదన వచ్చింది.అప్పటికే మేండెటరీ పాలస్తీనా (వలసల నివారణ)ను అమలు చేసిన బ్రిటీష్ ప్రభుత్వం సరిహద్దుల నిర్ణయాన్ని ఐక్యరాజ్యసమితికి అప్పజెప్పింది.1947 మే 15 సరిహద్దుల పరిష్కారానికి కమిటీ వేసింది.అదే ఏడాది నవంబరు 29 విభజనపై నివేదిక ఇచ్చింది. అయితే ఈ నివేదికను అరబ్ లీడ్,పాలస్తీనా అరబ్ హయ్యర్ కమిటీ తిరస్కరించారు.అదే ఏడాది అరబ్ సేనలు ఇజ్రాయెల్ వాసులైన యూదులపై దాడులు చేయడంతో మళ్లీ వివాదం మొదలైంది.ఆ తరవాత క్రమంలో 1948లో నాలుగు అరబ్ దేశాల సైన్యం ఈజిప్ట్, సిరియా,ట్రాంస్జోర్డాన్, ఇరాక్ ప్రత్యక్షంగా పాలస్తీనాకు మద్దతుగా యుద్దంలోకి దిగగా యేమన్, మొరొకొ,సౌదీ అరేబియా,సుడాన్ సైన్యాలు కూడా యుద్ధంలో పాల్గొన్నాయి.ఇదే 1948 అరబ్ – ఇజ్రాయెల్ యుద్ధంగా చెబుతారు.ఈ పరిణామాల నేపథ్యంలో 1949 మే 11 ఐక్యరాజ్యసమితి ఇజ్రాయిల్ పూర్తి స్వతంత్ర దేశంగా సౌర్వభౌమాధికారం కలిగి ఉందని ప్రకటించింది.అయితే వివాదాస్పద ప్రాంతం అందరికీ చెందుతుందని పలు సంస్థలు ప్రతిపాదించడంతో అంగీకారం తెలిపింది.ఇప్పుడు కూడా అదే ప్రాంతం కోసం యద్ధాలు జరుగుతున్నాయి.ఆ తరువాత 1967లో మరోసారి అరబ్, ఇజ్రాయిల్ మధ్య యుద్దం జరిగింది.ఈ యుద్ధంలో తూర్పు జెరూసలెంను జోర్డాన్ నుంచి ఇజ్రాయిల్ ఆక్రమించుకుని తమ రాజధానిగా ప్రకటించుకుంది.దీంతో ఈ వివాదం పెద్దదైంది.
Must Read ;- ఇజ్రాయెల్ లో విషాదం: తొక్కిసలాటలో 44 మంది యూదులు మృతి
ఉత్సవాలు..
కాగా జెరూసలెం తమ అధీనంలోకి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా మే9న జెరూసలెం డే నిర్వహిస్తోంది ఇజ్రాయిల్.ఏటా ఈ సంబరాలు జరుపుతుండడంతో పాలస్తీనియన్లు,అరబ్ దేశాలను,జోర్దాన్లను రెచ్చగొడుతోందనే విమర్శలూ ఉన్నాయి.అదే సమయలో తూర్పు జెరూసలెంలో పాలస్తీనీయులను ఖాళీ చేసేందుకు ఇజ్రాయిల్ ప్రయత్నిస్తుండడంతో ఉగ్రవాద చర్యలకు బీజం పడింది. యూదులకు,అరబ్బులకు పవ్రిత ప్రదేశంగా జరూసలేం ప్రసిద్ధి గాంచింది. దీంతో కొద్దిరోజుల కిందట పాలస్తీనా,ఇజ్రాయెల్ భధ్రతా దళాల మధ్య ఘర్షణ జరిగింది.మూడు మతాలకూ అత్యంత కీలకమైంది కాబట్టే జెరూసలెం పాత బస్తీని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించి,ప్రత్యేక రక్షణ కల్పించింనా ఈ ప్రాంతం కోసమే ఘర్షణలు జరుగుతున్నాయి.
అల్ అఖ్సా మసీదు..
ఇక్కడి అల్-అఖ్సా మసీదు ఇస్లాం మతస్థులు అత్యంత పవిత్రమైన స్థలాల్లో ఒకటిగా అల్ –షరీఫ్ పేరుతో పిలుస్తారు. మహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి వచ్చి ఇక్కడ ఒకరోజు ప్రార్థన చేశాక అంతర్ధానం అయ్యారని (వారి అర్థంలో పవిత్ర ప్రదేశానికి చేరారని) చెబుతారు.8వ శతాబ్దంలో ఈ మసీదు నిర్మించారు.
యూదులకు టెంపుల్ మౌంట్
ఇక్కడే యూదులకూ పవిత్రమైన ప్రాతం ఉంది.అదే టెంపుల్ మౌంట్.గతంలో ఇక్కడ రెండు యూదు ప్రార్థనా కేంద్రాలు ఉండేవి.అందులో ఒకటి కింగ్ సాల్మన్ నిర్మించినట్టుగా చరిత్ర ఉండగా ఇతర మతస్థుల దాడుల్లో అది ధ్వంసమైంది. రెండోది 15వ శతాబ్దంలో నిర్మించారు.ఇది కూడా రోమన్ల దాడుల్లో ద్వంసమైంది.ఇవే వారికి పవిత్ర ప్రాంతాలు.మెసయ్య మళ్లీ పునరాగమనం చేస్తాడని,అప్పుడు ఇక్కడే ఆలయం నిర్మాణం జరుగుతుందని వారు నమ్ముతారు.
ఫలితం ఇవ్వని శాంతి ఒప్పందాలు
కాగా 1967లో జరిగిన యుద్ధంలో జరూసెలం నుంచి జోర్దాన్ సేనలను తరిమికొట్టిన ఇజ్రాయెల్ ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. ఇజ్రాయెల్ దీనిని తమ రాజధానిగా ప్రకటించుకుంది.1990లో దేవాలయాలను పునర్మించే పనుల ప్రారంభానికి ప్రయత్నాలు జరగడంతో మళ్లీ వివాదాలు మొదలయ్యాయి.ఇరు దేశాలపై అంతర్జాతీయ ఒత్తిళ్ల నేపథ్యంలో 1994లో జోర్డాన్-ఇజ్రాయెల్ మధ్య యథాస్థితి కొనసాగించేలా శాంతి ఒప్పందం కుదరింది.జోర్డాన్ అధీనంలోని వక్ఫ్ సంస్థ మసీదు నిర్వహణ చూస్తుండగా ఇజ్రాయెల్ భద్రతా బలగాలు ఆ ప్రాంగణంలోనే ఉంటూ పర్యవేక్షణతో పాటు తమ పవిత్ర స్థలాల పరిరక్షణను చూసుకుంటారు.ముస్లింలకు మాత్రమే ప్రార్థన చేసేందుకు అనుమతి ఉంది. యూదులు కేవలం సందర్శించడానికి మాత్రమే అనుమతి ఉంది
మరో వివాదం..
ఇక్కడే మరో వివాదం తలెత్తింది.ముస్లింలకు మాత్రమే ప్రార్థనలకు అనుమతి ఇవ్వడం ఏంటని,తమకు కూడా ప్రార్థనలకు అనుమతి ఇవ్వాలని యూదులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు.కొన్నేళ్లుగా ఈ డిమాండ్ ఉన్నా మే9న జరూసలెండే రోజున ఈ నినాదాలు హోరెత్తతాయి.అధిక సంఖ్యలో యూదులు జరూసలేంకు వస్తున్న నేపథ్యంలో జోర్డాన్ అధికారికంగా ఇజ్రాయెల్కు, ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేసింది.అప్పటికే అల్లర్లు మొదలయ్యాయి.ఈ అల్లర్ల నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూలు అమలు చేయడంతో పాటు రంజాన్ ప్రార్థనలను కూడా ఇజ్రాయెల్ పోలీసులు నిషేధించారు. దీంతో అతివాద గ్రూపుల మధ్య ఘర్షణలు పెరిగాయి.ఈ ఘర్షణలు నడుస్తుండగా తూర్పు జెరూసలెంలోని కొన్ని ప్రాంతాల నుంచి పాలస్తీనీయులను ఖాళీ చేయించేందుకు ఇజ్రాయెల్ బలగాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శలూ మొదలయ్యాయి.ఈ క్రమంలో పాలస్తీనా మద్దతు ఉన్న అతివాద గ్రూపు, ఇజ్రాయెల్ ఉగ్రవాద సంస్థగా పిలిచే హమాస్ ఇజ్రాయెల్ ఆధీనంలోని ప్రాంతంపై రాకెట్ లాంచర్లతో దాడి చేసింది.ప్రతిగా పాలస్తీనా ఆధీనంలోని ప్రాంతాలతో పాటు గాజా నగరంపై,హమాస్ కార్యాలయాలపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. దీంతో యుద్దవాతావరణం తలెత్తింది.
Must Read ;- ‘కిమ్’ అనకుండా భరించాల్సిందే!