తెలంగాణ ప్రజలు రాజన్న రాజ్యాన్ని కాదని, రామ రాజ్యాన్నే కోరుకుంటున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. సిస్టర్ షర్మిల పార్టీ పెడతామంటూ హడావుడి చేస్తున్నారని, అది పూర్తిగా వృథా ప్రయాసేనని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు రాజన్న రాజ్యాన్ని కోరుకోవడంలేదని, రామరాజ్యం మాత్రమే వారు కోరుతున్నారని తెలిపారు.
ఆరోగ్యశ్రీ జమానా అయిపోయిందని, ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ జమానా వచ్చిందని అన్నారు. తెలంగాణలో అవినీతి పరులకు చోటు లేదని, ఇక్కడ నరేంద్ర మోదీ లాంటి క్లీన్ మనుషులకి, క్లీన్ గవర్నమెంటుకి మాత్రమే చోటుందని వ్యాఖ్యానించారు. ఒక వేళ ఆమె పార్టీ పెడితే శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు అరవింద్ అన్నారు.
Must Read ;- షర్మిలతో రాజన్న రాజ్యం సాధ్యమా?