May 6, 2026 12:02 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

రేవంత్ స్కెచ్‌కు.. కల్వకుంట్ల కవిత వర్గంలో హ్యాపీ

నిజామాబాద్ లోక్‌సభ పరిధిలో పసుపు బోర్డు ఏర్పాటుపై కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన సక్సెస్ కావడాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.

February 1, 2021 at 1:52 PM
in Editors Pick, Politics, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

శత్రువుకు శత్రువు మిత్రుడే.. కొన్నిసార్లు రాజకీయ నాయకులకు కూడా ఇది కలసి వస్తుంది. ప్రత్యర్థి పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులకు, నాయకులకు రాజకీయంగా బలహీనమయ్యే ఏ అవకాశమైనా ఇతర పార్టీల వారికి కలసి వస్తుందని చెప్పవచ్చు. సరిగ్గా ఇప్పుడు నిజామాబాద్ లోక్‌సభ పరిధిలో జరుగుతున్న పరిణామాలు అలాగే అనిపిస్తున్నాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ , కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్‌రెడ్డి నిజామాబాద్ లోక్‌సభ పరిధిలో పసుపు పంటకు మద్దతు ధర, పసుపు బోర్డు కోసం రైతులు చేపడుతున్న ఆందోళనలకు మద్దతుగా ఒకరోజు దీక్ష చేపట్టారు. భారీ సంఖ్యలో రైతులు ఈ సభకు వచ్చారు. ఈ సభలో అటు టీఆర్ఎస్‌ను, ఇటు బీజేపీని ముఖ్యంగా ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై విమర్శలు గుప్పించారు. సభ సక్సెస్ అయింది కాని ఫలితం ఎవరకు, ఎంత మేరకు ఉంటుందనే చర్చ మొదలైంది.

కల్వకుంట్ల కవిత ఓటమితో..

2014లో పసుపు బోర్డు ఏర్పాటు, నిజాం చెక్కెర కర్మాగారం (బోధన్)ని తెరిపించే హామీలు ఇచ్చిన కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత గెలుపొందారు. ఇక 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ ఓటమికి పసుపు బోర్డు ఏర్పాటు చేయకపోవడం ప్రధాన కారణంగా చెబుతారు. అందులో భాగంగానే 178 మంది రైతులు నామినేషన్ వేశారు. మిగతా 7మంది వివిధ పార్టీలకు చెందినవారు ఉన్నారు. ఆ ఎన్నికల్లో మొత్తం 185మంది బరిలో నిలిచారు. ఇంతమంది రైతులు నామినేషన్లు వేయడం వెనుక కేవలం పసుపు బోర్డే కాదని, రకరకాల కారణాలున్నాయన్న ఆరోపణలున్నా.. ఆ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ నుంచి ధర్మపురి అర్వింద్ గెలుపొందారు. ఏకంగా సీఎం కుమార్తె, సిట్టింగ్ ఎంపీ కవిత ఓడిపోవడం సంచలనం రేపింది. అప్పటి నుంచి అర్వింద్ వర్సెస్ టీఆర్ఎస్ పోరు నడుస్తోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఫైర్ బ్రాండ్ రేవంత్‌రెడ్డి పసుపు బోర్డు కోసం ఆందోళనకు రావడం, ఒకరకంగా చెప్పాంటే ఆందోళన సక్సెస్ కావడం బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యలో పోరు మొదలైందని చెప్పవచ్చు. అదే సమయంలో కల్వకుంట్ల కవితకు సానుభూతి పెరిగే అవకాశాలూ కనిపిస్తున్నాయి.

కేడర్ ఉన్నా..లీడర్లే..

ఈ లోక్‌సభ పరిధిలో ఉండే ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకత్వం కొన్ని చోట్ల మాత్రమే ప్రస్తుతం బలంగా ఉంది. జగిత్యాలలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి బలమైన నాయకుడిగా ఉన్నారు. ఇక ఆర్మూర్‌లో అధికార పార్టీ గెలవగా కాంగ్రెస్ నుంచి 2014లో పోటీ చేసిన సురేష్‌రెడ్డి కూడా టీఆర్ఎస్‌లో చేరారు. అక్కడ ఆకుల లలిత కాంగ్రెస్ లీడర్‌గా ఉన్నారు. బోధన్‌లో ఎమ్మెల్యే షకీల్ టీఆర్ఎస్ పార్టీ కాగా మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి కాంగ్రెస్ నేతగా ఉన్నా.. వయస్సు రీత్యా కొంత వెనుకబాటు కనిపిస్తోంది. ఈ లోక్‌సభ పరిధిలో ముఖ్య నాయకుడైన మధుయాష్కీ ఉన్నా లోక్‌సభ పరిధి మొత్తాన్ని ప్రభావితం చేయగలిగే అవకాశాలు తక్కువగా ఉండడం ప్రతిబంధకంగా మారింది. ఇక ఎంపీగా అర్వింద్ ఉండడం, నిజామాబాద్‌లో బీజేపీ కేడర్ బలంగా ఉండడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్లు కాగా, ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీకి చెందినవారు కావడంతో అధికార పార్టీ కార్యకలాపాలూ వేగంగానే ఉంటున్నాయి. ఎటొచ్చీ కాంగ్రెస్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.

Must Read ;- జాతీయ రహదారిని దిగ్భంధించిన నిజామాబాద్ ‘పసుపు’ రైతు!

వ్యూహం ఇలా..

పసుపు బోర్డు తేనందుకు కవితను ఓడించారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నుంచి గెలిచిన అర్వింద్ కూడా మాట తప్పారని టీఆర్ఎస్ చెబుతోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో అధికారంలో టీఆర్ఎస్ ఉందని, ఎంపీగా కవితని గెలిపించి ఉంటే.. చాలా సమస్యలు పరిష్కారం అయ్యేవని ఇప్పటికే సానుభూతి కోణంలో టీఆర్ఎస్ శ్రేణులు ప్రచారం మొదలు పెట్టాయి. అంతేకాకుండా.. పసుపు బోర్డు తేలేదని ఎంపీ అర్వింద్‌ను టీఆర్ఎస్ నుంచి ఎవరైనా ప్రశ్నించిన సందర్భంలో అర్వింద్ వరుస కామెంట్లతో పరువు తీసే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో టీఆర్ఎస్ నుంచి భారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి లేదు. ఇక ఇటీవలి కాలంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటన తరువాత బీజేపీపై దూకుడు తగ్గించినట్లు చర్చ నడుస్తోంది. సరిగ్గా అదే సమయంలో కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. దీనిపై ఎంపీ అర్వింద్ ఎలాగూ కౌంటర్ ఇస్తారు. పంచ్‌లు విసురుతారు. ధర్మపురి అర్వింద్ చేస్తున్న కామెంట్లు తొలినాళ్లలో బీజేపీలో జోష్ నింపినా..క్రమేణా ప్రజల్లో నెగెటీవ్ అయ్యే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో మన లీడర్, మన ప్రభుత్వం, మన కవిత అని ప్రచారం మొదలు పెట్టింది టీఆర్ఎస్. పసుపు బోర్డు విషయంలో కాంగ్రెస్ చేసిన దీక్ష, ఆందోళన విషయంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. బీజేపీని, అర్వింద్‌ను, టీఆర్ఎస్‌ను టార్గెట్ చేసింది. కాని.. అర్వింద్‌పై వ్యతిరేకతను కవిత పట్ల సానుభూతిగా మార్చేందుకు ఇప్పటికే టీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టాయి.

ప్రాంతీయ కార్యాలయం వర్సెస్ పసుపు బోర్డు..

2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ధర్మపురి అర్వింద్ పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ పై హామీ ఇచ్చారు. ఇది నియోజకవర్గంలో చాలా ప్రభావం చూపింది. అయితే, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటైంది. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్‌ స్పైసెస్ బోర్డు డివిజన్ కార్యాలయాన్ని రీజనల్ హోదా కార్యాలయంగా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పసుపు బోర్డు తరహాలో ప్రయోజనాలు ఉంటాయని, అంతకంటే మంచిది తెచ్చానని ధర్మపురి అర్వింద్‌తో పాటు బీజేపీ నాయకులు చెబుతున్నారు. కాగా 2010లో కేరళ, తమిళనాడు, కర్ణాటక, సిక్కిం, గువాహటి, గుజరాత్‌, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కోసం గుంటూరు, వరంగల్‌లో ప్రాంతీయ కార్యాలయాలను కేంద్రం ఏర్పాటు చేసిందని, 16 జోనల్, 13 మార్కెటింగ్ కార్యాలయాలున్నాయని, ప్రత్యేకంగా పసుపు రైతులకు చేసిన మేలు ఏంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. పసుపు బోర్డు తెస్తానని హామీ ఇచ్చి గెలిచిన ధర్మపురి అర్వింద్ మాట తప్పారని కొన్ని రైతు సంఘాలు, వైరి పక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అర్వింద్‌పై వచ్చే ప్రతి ప్రతికూల అంశాన్ని టీఆర్ఎస్ తనకు సానుకూలంగా మార్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read ;- అర్వింద్ బాల్య వితంతువుగా మారుతావా?: రేవంత్

Tags: congress leader Revanth ReddyCongress MP Revanth ReddyEditorspickkalvakuntla kavithakalvakuntla kavitha in nizamabadkalvakuntla kavitha mlc electionskarimnagar turmeric farmerskcr daughterKCR Daughter Kalvakuntla KavithaKCR vs revanth reddynizamabad turmeric farmersnizamabad turmeric farmers NewsRevanth Reddyrevanth reddy in farmers protestrevanth reddy latest newstelugu newstrs plan to get advantage of congress agitation on turmeric boardturmericturmeric boardTurmeric Board in NizamabadTurmeric Board in Nizamabad newsturmeric board newsturmeric cropturmeric farmers agitation in nizambad district
Previous Post

సాధినేని యామినికి కీలక పదవి!

Next Post

బడ్జెట్ ప్రభావం.. ఏవి ప్రియం? వేటిపై తగ్గుదల?

Related Posts

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Bollywood Actress Nyeisha Rajput Dazzling Still

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అనిల్-జీవీఎల్ అందరూ చెప్పేది నిజమేనట!

ఐపీఎల్ నిరవధిక వాయిదా

Actress Pragathi Latest Pics Going Viral

అశోక్ ప్రాభవానికి గండికొట్టేలా.. ఏదో జరుగుతోందక్కడ!

Mind Blowing Hot Photos Of Ketika Sharma

సాక్షి పత్రిక మూత..?? 650 కోట్ల స్కామ్‌తో భారతి అడ్డంగా బుక్‌..!!

నవ గ్రహాల అనుగ్రహాన్ని ఎలా పొందాలి?

గీతదాటిన పోలీసులు సంజాయిషీ చెప్పాల్సిందేనా?

ముఖ్య కథనాలు

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist