తెలుగులో అఆ, ప్రేమమ్, శతమానంభవతి.. చిత్రాలతో మెప్పించిన మలయాళీ భామ అనుపమా పరమేశ్వరన్. తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఆతర్వాత తేజ్ ఐ లవ్ యు, హలో గురు ప్రేమ కోసమే, ఉన్నది ఒక్కటే జిందగీ, రాక్షసుడు చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది. అయితే.. ఆమె నటించిన చిత్రాలు ఆశించిన స్ధాయిలో సక్సస్ కాకపోవడంతో ఆతర్వాత నుంచి అవకాశాలు రాక కెరీర్ లో బాగా వెనకబడింది. పాత్రలకు తగ్గట్టుగా నటించి మెప్పించే గుడ్ పర్ ఫార్మర్ అయినప్పటికీ రేసులో వెనకబడింది. రాక్షసుడు సినిమాతో సక్సస్ సాధించినప్పటికీ చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు.
అయితే.. నిఖిల్ సరసన నటించే ఛాన్స్ వచ్చింది. నిఖిల్ హీరోగా 18 పేజీస్ అనే సినిమా రూపొందుతోంది. ఇందులో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ మూవీని బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఇది నిర్మాణంలో ఉండగానే అనుపమకు నిఖిల్ సరసన నటించే మరో ఛాన్స్ కూడా వచ్చినట్టు తెలిసింది. ఇంతకీ ఏ సినిమాలో అంటే.. నిఖిల్ హీరోగా గతంలో వచ్చిన కార్తికేయ సినిమా మంచి హిట్టయింది. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించారు. ఇప్పుడు కార్తికేయ చిత్రానికి సీక్వెల్ చేస్తున్నారు.
ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తుంది. అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఎప్పుడో ఈ సినిమాని ఎనౌన్స్ చేసారు. త్వరలో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో కూడా నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించనున్నట్టు సమాచారం. ఇప్పుడిప్పుడే అనుపమ మళ్లీ అవకాశాలను దక్కించుకుంటుంది. మరి.. నిఖిల్ తో చేస్తున్న సినిమాలతో అయినా.. అనుపమ మళ్లీ ఫామ్ లోకి వస్తుందేమో చూడాలి.
Must Read ;- చేపకళ్ల అనుపమా .. చిలిపి చూపుల చిరునామా (బర్త్ డే స్పెషల్)