టీడీపీ అఫిషియల్ ఫేస్ బుక్పై పోలీసులు ఐటీ యాక్ట్ 66, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్లు తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని కించపరుస్తూ టీడీపీ అఫీషియల్ ఫేస్ బుక్లో పోస్టింగ్ పెట్టారంటూ వారిపై వైసీపీ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మూడ్రోజుల క్రితం బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, కె.అనిల్ కుమార్ డీజీపీకి క్లిప్పింగులతో సహా ఫిర్యాదు చేశారు. దీనిపై డీజీపీ విజయవాడ సైబర్ క్రైమ్కు వివరాలు పంపించారు. ఈ కేసులో టీడీపీ అఫీసియల్ ఫేస్ బుక్ నిర్వాహకుడిని కూడా నిందితుడిగా చేర్చారు. కేసు నమోదు చేసిన విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ ప్రారంభించారు.
జగన్కి ఢిల్లీ టెన్షన్..? కేజ్రీవాల్, కవిత అరెస్టులతో వైసీపీలో వణుకు..!!
ఏపీలో అన్ని స్థానాల్లో విజయం మనదే అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు ఏపీ సీఎం...