తిరుపతిలో ఉప ఎన్నికల ప్రచారం చేస్తుండగా చంద్రబాబుపై రాయి విసిరిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం తిరుపతి రోడ్ షోలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా దుండగులు రాయి విసిరిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మహిళతో పాటు మరో యువకుడికి గాయాలయ్యాయి. టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ ఫిర్యాదు మేరకు తిరుపతి పశ్చిమ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. మరో వైపు ఈ ఘటనపై టీడీపీ ఎంపీలు ఢిల్లీలో సీఈసీకి ఫిర్యాదు చేయనున్నారు.
Also Read:ఈ ఉగాది సుఖ సంతోషాలను ఇవ్వాలి : చంద్రబాబు











