తెలంగాణలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్, ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికలకు శుక్రవారంలో ప్రచార గడువు ముగియనుంది. 14న జరిగే ఈ ఎన్నికల్లో ఇప్పటికే పార్టీలు, అభ్యర్థులు వివర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించారు. ప్రచారానికి గడువు ముగియనుండడంతో ఆఖరి అస్త్రాలు సంధిస్తున్నారు. విమర్శల్లో జోరు పెంచారు. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లు రెండుచోట్లా అభ్యర్థులను నిలపగా హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్లో టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ పోటీలో ఉన్నారు. మొత్తం మీద 160 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వర్గాలు, ఉద్యోగసంఘాలు, వ్యాపార సంఘాలు, జర్నలిస్టులు ఇలా..అభ్యర్థులు ఇప్పటికే సమావేశాలు ఏర్పాటుచేసి పలు హామీలు ఇచ్చారు.
అభ్యర్థుల ఎంపికతో పాటు..
రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్నగర్ ఎమ్మెల్సీగా బీజేపీ నుంచి రాంచందర్రావు, నల్గొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ కు చెందిన పరిటాల శ్రీరామ్పై కేసు నమోదుప్రాతినిధ్యం సిట్టింగ్ ఎమ్మెల్సీలుగా ఉన్నారు. ఈ రెండు పార్టీలు తమ ప్రాతినిధ్యాన్ని నిలబెట్టుకోవడంతో పాటు ప్రత్యర్థి సీటును కూడా కైవసం చేసుకోవాలని తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించారు. అదే సమయంలో కాంగ్రెస్ కూడా ఓట్ల చీలికపై ఆశపెట్టుకుంది. టీఆర్ఎస్ విషయానికి వస్తే..రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్నగర్ నుంచి దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవిని అభ్యర్థిగా నిలగా కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి, బీజేపీ సిట్టింగ్ అభ్యర్థి రామచందర్ రావు, టీడీపీ నుంచి ఎల్ రమణ, స్వతంత్ర అభ్యర్థిగా నాగేశ్వర్ తదితరులు బరిలో నిలిచారు. మరోస్థానంలో టీడీపీ అభ్యర్థిని నిలపలేదు. తెలంగాణ జనసమితి చీఫ్ కోదండరామ్కి మద్దతు ఇస్తుండగా టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి రాములునాయక్, వామపక్షాల నుంచి జయసారథి రెడ్డి, తెలంగాణ ఇంటిపార్టీ చెరకు సుధాకర్, యువ తెలంగాణ పార్టీ నుంచి రాణి రుద్రమ, మరో స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు.
ఎన్నడూ లేని రీతిలో ప్రచారం..
ఈ ఎన్నికల్లో గెలిచేందుకు పార్టీలు గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రచారం చేస్తున్నాయి. వరుస ఓటముల నేపథ్యంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్కస్థానమైన గెలిచి తమ పరువు దక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. దుబ్బాక ఓటమి, జీహెచ్ఎంసీల్లో నిరాశాజనక ఫలితాల నుంచి బయటపడాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు మాత్రమే మార్గమని టీఆర్ఎస్ భావిస్తోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ జోరులోనే ఎమ్మెల్సీ సీట్లను గెలిస్తే.. రానున్న కాలంలో పార్టీ విస్తరణ వేగంగా చేయవచ్చని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఆయా పార్టీల నుంచి కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, హరీష్ రావు, కవిత, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రఘునందన్ రావు, డీకే అరుణ, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, తదితరులు తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.
అనుబంధ మద్దతు..
శుక్రవారంతో ప్రచారానికి గడువు ముగియనుండడంతో పార్టీలతో పాటను అనుబంధ విభాగాలు, మద్దతు విభాగాలు ప్రచారంలో తలమునకలయ్యాయి. ప్రతి 25మంది ఓట్లరకు బీజేపీ ఓ కమిటీ ఏర్పాటు చేయడంతోపాటు ఇన్ ఛార్జిలను కూడా నియమించింది. వార్డులు, ప్రాంతాల వారీగా టీఆర్ఎస్ తమ నాయకులకు బాధ్యతలు అప్పగించింది. కాంగ్రెస్ పార్టీ..యువజన విభాగం నుంచి సహకారం పొందుతోంది. ఓటు వేయమని చెప్పడంతోనే సరిపెట్టకుండా..ప్రథమ ప్రాధాన్యం ఓటు వేయాలని ఒకటికి రెండుసార్లు కోరుతున్న పార్టీలు.. బూత్ వారీగా రెండో, మూడో విడత ప్రచారాలూ ప్రారంభించాయని చెప్పవచ్చు. అధికారికంగా శుక్రవారంతో ప్రచారం ముగియనున్నా.. అంతర్గత ప్రచారం మాత్రం కొనసాగుతుందన్న అంచనాలున్నాయి. ఫోన్ల ద్వారా, ప్రకటనలు, సందేశాలతో పాటు మరికొన్ని మార్గాల ద్వారా గతంలో ఎన్నడూ లేని రీతిలో ‘ఆఫ్ ది రికార్డు’ ప్రచారం జరుగుతుందని చెప్పవచ్చు.
Also Read :సాగర్లో కాంగ్రెస్ దూకుడు.. బీజేపీ, టీఆర్ఎస్ తడబాటు











