గత రెండేళ్లుగా ఇసుక కొరతతో రాష్ట్రంలో భవన నిర్మాణ రంగం కుదేలైందని, ట్రాక్టర్ ఇసుకను రూ.1000కే ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కోరారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్మోహన్రెడ్డికి లేఖ రాశారు. ఇసుక దొరకక నిర్మాణదారులు, పనులు లేక భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇసుక దొరకక వినియోగదారులు ఇన్ని ఇబ్బందులు పడుతుండగా రాష్ట్రంలో ఇసుక సరపరా కాంట్రాక్ట్ను దివాలా తీసిన కంపెనీకి అప్పగించటం ఆశ్చర్యకరమని అన్నారు. ఇందులో క్విడ్ ప్రోకో జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయని, వీటికి సమాధానం చెప్పాలని రామకృష్ణ లేఖలో సీఎం జగన్ను కోరారు.
Must Read ;- క్విడ్ ప్రో కో నేటికీ కొనసాగిస్తున్న జగన్ : సబ్బం హరి