వికారాబాద్ జిల్ల తాండూర్ మున్సిపల్ మహిళా చైర్ పర్సన్ తాటికొండ స్వప్నపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇటీవల తెలంగాణలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆమె తన తోటి కోడలు పేరుపై దొంగ ఓటు వేసినట్లు ప్రతిపక్షాలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఓటు లేకున్నా గత నెల 14న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆమె దొంగ ఓటు వేసినట్లు కాంగ్రెస్ నేతలు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఎన్నికల సంఘానికి నివేదిక పంపించారు. రాష్ట్ర ఎన్నికల అధికారి చేసిన విచారణలో స్వప్న దొంగ ఓటు వేసినట్లు నిర్ధారణ అయింది. దీంతో స్వప్నపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారి కలెక్టర్ను ఆదేశించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ మోతిలాల్ ఆదేశాల మేరకు ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు సీఐ రవికుమార్ తెలిపారు.
Also Read:మున్సిపల్ ఛైర్మన్ అవ్వడానికి జగన్ హెల్ప్ చేశారు.. జేసీ ప్రభాకర్రెడ్డి











