తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్పై సీనియర్లు మౌనరాగం అందుకున్నారు. నిన్నమొన్నటి వరకు కత్తులు దూసిన వారంతా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. అధిష్టానం పిలుపుతో ఢిల్లీ వెళ్ళి వచ్చిన తరువాత ఏ ఒక్కరూ నోరు విప్పడం లేదు. ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోయారు. ఢిల్లీ వెళ్ళిన వారికి అధిష్టానం ఏం చెప్పింది.. అసలు వారంతా ఒక్కసారిగా ఎందుకు సైలెంట్ అయిపోయారన్నది అంతుచిక్కడం లేదు. అభిప్రాయ సేకరణ సమయంలో ఏకంగా పార్టీ ఇన్చార్జి పైనే ఆరోపణలు చేసి తమకు నచ్చని వారిని అధ్యక్షుడిని చేస్తే ఊరుకునేది లేదని ప్రకటనలు చేసిన వారంతా ఇప్పుడు పూర్తిగా గప్ చుప్ అయిపోయారు.
బహిరంగ విమర్శలు చేసింది వీహెచ్ ఒక్కడే
ఢిల్లీ వెళ్ళి వచ్చిన తరువాత వీహెచ్ ఒక్కడే నోరు విప్పారు. రేవంత్కు పీసీసీ ఇస్తే పార్టీ వీడుతా అంటూ సంకేతం ఇచ్చారు. ఆయన మినహా ఏ ఒక్కరూ మీడియాకు కనీసం అందుబాటులో లేకుండా పోయారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం తన మార్క్లో నేతలకు సందేశం ఇచ్చినట్టే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యనేతలందరినీ ఢిల్లీ పిలిపించుకున్న అధిష్టానం వారికి ఖచ్చితమైన ఆర్డర్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు తమ వద్ద ఉన్న ప్రణాళికను అమలు చేస్తామని.. అందరికీ సమాన అవకాశాలు ఇస్తామంటూ తెలపినట్టు సమాచారం. అంతా కలిసి పార్టీని బలంగా ముందుకు నడిపించాలని .. ప్రజల్లో పార్టీపై నమ్మకం కలిగించి పూర్వవైభవం తీసుకువచ్చేలా కృషి చేయాలంటూ ఆదేశించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
పీసీసీపై ఏమీ మాట్లాడం.. అధిష్టానం ఏది చెప్పినా సై..
పీసీసీ పదవిపై తలో మాట మాట్లాడటంతో కార్యకర్తల్లో గందర గోళం ఏర్పడే అవకాశం ఉందని.. పేరును ప్రకటించే వరకు సైలెంట్గా ఉండాలని నేతలంతా నిర్ణయించడంతో ఊహాగానాలు రాజ్యమేలుతున్నాయి. రేవంత్కు పట్టం గడితే తమ దారి తాము చూసుకుంటామని సంకేతాలిచ్చిన వారంతా ఇప్పుడు ఏమీ మాట్లడటం లేదు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పుడు ఏమి మాట్లాడినా పార్టీకి డ్యామేజ్ అవ్వడమే కాకుండా అధిష్టానం దృష్టిలో చెడ్డపేరు వస్తుందని ముఖ్యనేతలంతా యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. చెప్పే వరకు చెప్పి చూసామని.. ఆ తరువాత అంతా అధిష్టానం ఇష్ట ప్రకారమే అంటూ అంతా తప్పించుకు తిరుగుతున్నారు. అయితే, కాంగ్రెస్ సీనియర్లు అంతా ఒక్కసారిగా మౌనం దాల్చడంలో ఆంతర్యం ఏమిటి.. ఇది తుపాను వచ్చేముందు ప్రశాంతతా అంటూ రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు .
Must Read ;- రేవంత్కి టీపీసీసీ.. ఇద్దరికి సీడబ్ల్యూసీ ?