ఏపీకి రాజధాని కావాలి .. సీమకు పూర్వవైభవం తేవాలే!
ఆంధ్రప్రదేశ్ కు రాజధాని, సీమకు అభివృద్ధి అన్నది అత్యవసరం! దీనికి తప్పనిసరిగా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అటువంటి అంశాలపై దృష్టిసారించాలి. అంతేకాని ఉన్న రాజధానిని కూలదీసి .. మూడు రాజధానులంటూ ముందుకుపోవడం ఎంత వరకు సబబు! నిన్న తిరుపతి వేదికగా జరిగి అమరావతి రైతు మహోద్యమ సభలో అఖిపక్షం నేతల ప్రతినోట ఒకటే మాట .. రాజధాని అమరావతే .. జగన్ రెడ్డి ప్రభుత్వ పతనానికి మూడు మెట్లే .. ఈ మూడు రాజధానుల అంటూ ఎలుగెత్తారు..! దుమ్మెత్తిపోశారు..!! జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అంశమే అట్టర్ ఫ్లాప్ అయిందని ఆయన తప్పా .. దేశం మొత్తం గుర్తించింది. కానీ ఇంకా జగన్ రెడ్డి అర్థంకాలేదు అంతే! ఇది అలా ఉంటే.. వికేంద్రీకరణ కావాలని చెప్పి రాయలసీమ మేధావులను, విద్యార్థులను రోడ్లపైకి తీసుకొచ్చి ఏపీలో విచ్ఛిన్నకర రాజకీయాలకు తెర తీస్తున్నారు! ఈ అనాలోచిత చర్య ఎంతమేరకు మంచి పద్ధతి కాదు!! మూడు రాజధానులు కావాలని తిరుపతి ఇందిరా మైదానంలో భారీ బహిరంగ సభను రాయలసీమ మేధావులు ఫోరం ఏర్పాటు చేసింది. సభ విజయవంతానికి డ్వాక్రా మహిళలను, విద్యార్థులను పెద్ద ఎత్తున సమీకరించి సభకు తీసుకొచ్చారు. కానీ వారికి అక్కరలేని సబ్జెక్ట్ కాబట్టి సభ ప్రారంభమైన అరగంటకే పలాయనం చిత్తగించారు. గేటు తాళాలు వేసిన సరే.. గేట్లు దూకిమరి పారిపోయ్యారు! ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో వికేంద్రీకరణ మంత్రాన్ని సీమ ప్రజలపై రుద్దాలని సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు.
సభ ప్రాంగణంలో జై అమరావతి.. జై జై అమరావతి అంటూ నినాదాలు!
రాయాలసీమ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో తిరుపతిలో మూడు రాజధానులకై చైతన్య సభ నిర్వహించారు. ఈ సభ వేదికనే మూడు రాజధానుల కావాలని నినదించే ప్రయత్నం చేశారు. కానీ సభ వేదికపై ఆశీనులైన అతిధులు, సభ బయట విద్యార్థులు మదిలో ఉన్నది ఒకటే .. ఏపీ రాజధాని అమరావతి అని! సభ వేదికపై అతిధులుగా హాజరైన మేధావుల ప్రసంగంలోని సారమంతా సీమ అభివృద్ధే!! సీమ అభివృద్ధికి ప్రభుత్వం యుద్ధప్రాతి పదికన చేయాల్సిన ప్రతిపాధనలు, ముఖ్యమంత్రి తక్షణ విధులను మేధావులు గుర్తుచేశారు. ఏపీలో ఎవరైన కోరుకునేంది సర్వోతోముఖాభివృద్ధే. అలా అభివృద్ధి విస్తరించాలంటే తప్పనిసరిగా.. రాజధాని కావాలి! మూడు రాజధానుల సభ అసాంతం రాజధానులు కన్నా .. రాజధాని ముఖ్యమన్న ఏకాభిప్రాయాలను వ్యక్తం చేశారు మేధావులు. మరో వైపు సభను వ్యతిరేకించి.. గేటు దూకి బయటకు వస్తున్న విద్యార్థులు.. జై అమరావతి.. జై జై అమరావతి.. అంటూ నినాదాలు చేస్తూ మరి వారి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు! ఇది దేనికి సంకేతం.. ? ఇప్పటికైన జగన్ మోహన్ రెడ్డి, ఆ పార్టీ మంత్రులు గమనిస్తే .. రాష్ట్రం బాగుపడుతోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.