ఈ సంక్రాంతికి రెడ్ తో అభిమానుల్ని పలకరించిన రామ్ పోతినేని .. ఆ సినిమాతో మిశ్రమఫలితాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం రామ్ .. పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టుకున్నాడు. ఆ లిస్ట్ లో తమిళ స్టార్ డైరెక్టర్ లింగు సామి దర్శకత్వంలో చేస్తున్న సినిమా కూడా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ మీదుంది. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ఇందులో కథానాయికగా నటిస్తోంది.
శ్రీనివాసా సిల్వర్ స్ర్కీన్ బ్యానర్ పై.. శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా.. మాస్ యాక్షన్ మూవీగా రూపొందుతోంది. ఇస్మార్ట్ శంకర్ తో మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న రామ్.. ఈ సినిమాలో అంతకు మించి అనే రేంజ్ లో పెర్ఫార్మ్ చేయబోతున్నాడట.
ఇక ఈ సినిమా కి సంగీతం రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ అందించనుండడం విశేషం. ఆ మేరకు మేకర్స్ దేవీ శ్రీని ఈ ప్రాజెక్ట్ లోకి ఆహ్వానం పలికారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ రామ్ కాంబినేషన్ లో గతంలో పలు చిత్రాలు వచ్చాయి. అవన్నీ సూపర్ హిట్ ఆల్బమ్స్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి దేవీ శ్రీ సంగీతం అందించబోతుండడం ఆసక్తిని రేపుతోంది. మరి ఈ సినిమా రామ్ పోతినేనికి ఏ రేంజ్ సక్సెస్ అందిస్తుందో చూడాలి.
Must Read ;- రానా సరసన కథానాయికగా అందాల నిధి