అక్కినేని నాగచైతన్య ‘సవ్యసాచి’ మూవీతో టాలీవుడ్ లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది అందాల భామ నిధి అగర్వాల్. ఆ సినిమా రిజల్ట్ తేడా కొట్టినప్పటికీ.. అమ్మడి అందాల ఎఫెక్ట్ తో అవకాశాలకు ఎలాంటి అడ్డంకి రాలేదు. అన్న చైతూ సినిమాలో హిట్ కొట్టలేకపోయిన ఈ సుందరి.. తర్వాత తమ్ముడు అఖిల్ సినిమా ‘మిస్టర్ మజ్ను’ లో నటించి ఆ సినిమాతో కూడా ప్లాప్ దెబ్బతింది. మొత్తం మీద అన్నదమ్ములతో వరుస సినిమాల్లో నటించిన నిధి అందాలకు యూత్ మాత్రం ఫిదా అయ్యారు. మొహమాటం లేకుండా అందాలు ప్రదర్శించడం ఆమెకు ప్లస్ అయింది. దాంతో పూరీ దృష్టిలో పడింది. రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ లో ఒన్ ఆఫ్ ది హీరోయిన్స్ అయిపోయింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టవడంతో నిధి అగర్వాల్ కు వరుస ఆఫర్స్ వచ్చిపడ్డాయి.
ఇస్మార్ట్ శంకర్ హిట్ తో నిధి అగర్వాల్ కు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో కథానాయికగా ఛాన్స్ దక్కింది. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న జానపద చిత్రం ‘హరిహర వీరమల్లు’ లో నిధి అగర్వాల్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. అమ్మడి హైటు, అందం వల్ల ఈ అరుదైన అవకాశం దక్కిందని చెప్పుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆమె హైటు కు తగ్గట్టే.. రానా దగ్గుబాటి తో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కిందని టాక్ వినిపిస్తోంది. రానాతో ఓ పెద్ద బ్యానర్ లో త్వరలో ప్రారంభం కాబోయే సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోందట. రానా ప్రస్తుతం విరాటపర్వం లో నటిస్తున్నాడు. దాంతో పాటు .. పవర్ స్టార్ తో అయ్యప్పనుమ్ కోషియుమ్ తెలుగు వెర్షన్ లోనూ నటిస్తున్నాడు. ఈ రెండూ కంప్లీట్ అయ్యాకా .. ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన నిధి అగర్వాల్ .. పెద్ద హీరోల కాంపౌండ్ లోకి ప్రవేశించినట్టే.
Also Read:14 రీల్స్ బ్యానర్ లో రానా దగ్గుబాటి సినిమా?











