పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’. ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే నటిస్తుంది. ఫస్ట్ టైమ్ పూజా ‘బాహుబలి’ ప్రభాస్ సరసన నటిస్తుండడం విశేషం. పిరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ క్రేజీ మూవీని యు.వి. క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇందులో రెబల్ స్టార్ కృష్ణంరాజు కీలక పాత్ర పోషిస్తున్నారు. అభిమానులు ఎప్పటి నుంచో రాధేశ్యామ్ అప్ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.

ఇటలీ షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని తెలిసింది. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే… ప్రభాస్ ఫ్యాన్స్ కోసం సంక్రాంతికి టీజర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ ప్రస్తుతం ఈ మూవీ టీజర్ కట్ చేసే పనిలో ఉన్నారని తెలిసింది. మరో విషయం ఏంటంటే.. ఈ సినిమాని ఏప్రిల్ 30న రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేశారని సమాచారం. అయితే.. ఇప్పటి వరకు రిలీజ్ డేట్ ను అఫిషియల్ గా ప్రకటించలేదు. టీజర్ తో పాటు రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స చేస్తారని.. సంక్రాంతికి ప్రభాస్ కి ఇదో స్పెషల్ గిప్ట్ లా ఉండబోతుంది అని టీమ్ భావిస్తుందట.
రీసెంట్ గా పూజా హేగ్డే తన షూటింగ్ ను కంప్లీట్ చేసింది. మిగిలి ఉన్న సీన్స్ ను త్వరలోనే షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘సాహో’ రిజెల్ట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త డల్ అయ్యారనే చెప్పచ్చు. అయితే.. వరుసగా సినిమాలు ఎనౌన్స్ చేస్తుండడం.. సలార్ మూవీని 2021 దసరాకి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుండడం మాత్రం ఫ్యాన్స్ లో జోష్ నింపింది. మరి.. సంక్రాంతికి రానున్న ‘రాధేశ్యామ్’ టీజర్ ఫ్యాన్స్ ని ఎంత వరకు ఆకట్టుకుంటుందో..? సోషల్ మీడియాలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.











