టాలీవుడ్ లో వైవిధ్యమైన సినిమాలు ఎన్నిటినో తెరకెక్కించి క్రియేటివ్ డైరెక్టర్ అనిపించుకున్నారు కృష్ణవంశీ. నిజజీవితంలోని పాత్రల్ని తెరమీద ఆవిష్కరించడంలో ఆయన దిట్ట. అలాగే.. కుటుంబ బంధాల్ని, మానవ విలువల్ని తన చిత్రాల్లో ప్రతిబింబింప చేయడం ఆయన శైలి. నేడు మహాశివరాత్రి సందర్భంగా కృష్ణవంశీ తదుపరి చిత్రానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ వచ్చింది. సినిమా పేరు ‘అన్నం’. పరబ్రహ్మ స్వరూపం ట్యాగ్ లైన్.
ఒక అరిటాకు మీద అన్నం మెతుకులతో కూడిన అన్నం టైటిల్ .. ఆకట్టుకుంటోంది. అలాగే అరిటాకు మీద రక్తం, వేటకొడవలి, మంగళసూత్రం .. ఆకు చుట్టూ కాల్ మనీ, ల్యాండ్ మాఫియా, ఎడ్యుకేషన్, గవర్నమెంట్ లాంటి టైటిల్స్ కనిపిస్తున్నాయి. నేటి సమాజంలో ఒక మనిషి అన్నం తినడానికి.. రకరకాల స్కాములు, స్కీములు పెట్టి ఇతరుల్ని మోసం చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నాడని ఒక సందేశాన్ని ఇవ్వబోతున్నారని అర్ధమవుతోంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన స్టార్ కేస్టింగ్, టెక్నికల్ టీమ్ ను ఇంకా ఎంపిక చేయలేదు. ప్రస్తుతం అన్నం సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందట.
ప్రస్తుతం కృష్ణంశీ‘ రంగ మార్తాండ’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరాఠీ సినిమా ‘నట సామ్రాట్’ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఒరిజినల్ లో నానా పాటేకర్ పోషించిన టైటిల్ పాత్రను తెలుగులో చేస్తున్నారు. అనసూయ, బ్రహ్మానందం, శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్ ఇతర ముఖ్యపాత్ర ‘నట సామ్రాట్’ లు పోషిస్తున్నారు. ఈ సినిమాను వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి.. ‘అన్నం’ సినిమా ను ట్రాక్ మీదకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు కృష్ణవంశీ. మరి అన్నం మూవీ క్రియేటివ్ డైరెక్టర్ కు ఏ స్థాయిలో పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.
Also Read :కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ సినిమా ఆగిపోయిందా.?











