మాస్ మహారాజా రవితేజ, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలయికలో వచ్చిన యాక్షన్ మూవీ ‘నేనింతే’. సినిమా రంగంపై పూరీ సంధించిన ఈ సెటైరికల్ డ్రామా అంతగా ఆడక పోయినప్పటికీ.. రవితేజ కు మాత్రం బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డును తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో శియా అనే ఓ అందాల హీరోయిన్ టాలీవుడ్ కు పరిచయం అయిన సంగతి తెలసిందే. ఈ సినిమా బాగా ఆడి ఉంటే అప్పట్లో అమ్మడికి అవకాశాలు బాగా వచ్చి ఉండేవేమో కానీ.. ఆమె ఆ తర్వాత ‘వేదం’ అనే మూవీలో ఒక చిన్న పాత్ర మాత్రమే పోషించింది. ఆ తర్వాత బాలీవుడ్ మూవీ సంజులో ఆఖరి సారిగా తెరమీద కనిపించింది. ఆ తర్వాత శియా జాడే లేదు.
ప్రస్తుతం ముంబై లో సెటిలైన ఈ బ్యూటీ .. దాదాపు పదకొండేళ్ళ తర్వాత ఇప్పుడు టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. గోపీచంద్, మారుతి కలయికలో వస్తున్న పక్కా కమర్షియల్ మూవీలో శియా ఓ కీలక పాత్ర కు ఎంపికైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే శియాతో మారుతి సంప్రదింపులు జరిపాడని టాక్. త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోతున్న ఈ సినిమా లోని శియా పాత్ర గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావల్సిఉంది. మరి శియా ఈ సినిమాతో ఇంకెన్ని అవకాశాలు అందుకుంటుందో చూడాలి.
Must Read : విజిల్స్ వేయిస్తోన్న గోపీచంద్ ‘సీటీమార్’ టీజర్











