టాలీవుడ్ బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ .. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జీఏ 2 పిక్చర్స్ బన్నీవాసు, సుక్కుతో కలిసి నిఖిల్ హీరోగా, పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ‘18 పేజెస్’ అనే వెరైటీ మూవీ నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఇదే సంస్థలో మరో మూవీ కూడా నిర్మాణం జరుపుకోబోతోంది. ఆర్.ఎక్స్ 100 హీరో కార్తికేయ హీరోగా ఈ సినిమా రూపొందనుంది. దీనికి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పకులు గా వ్యహరించబోతున్నారు.
ఆల్రెడీ జీఏ2 పిక్చర్స్ వారు కార్తికేయతో ‘చావుకబురు చల్లగా’ సినిమా నిర్మించిన సంగతి తెలిసిందే. పెగళ్ళపాటి కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 19న విడుదల కాబోతోంది. సినిమాపై ఆల్రెడీ పాజిటివ్ బజ్ నెలకొంది. దీనికి తోడు ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా ఉండడంతో.. ఈ సినిమాకి అప్పుడే హిట్ కళ వచ్చేసింది. అందుకే ఇదే హీరోతో .. బన్నీవాసు, సుక్కూ మరో సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో అఫీషియల్ గా ప్రకటించారు. అయితే ఈ సినిమాకి ఇంకా కేస్టింగ్ కానీ, డైరెక్టర్ గానీ కన్ఫర్మ్ కాలేదు. సినిమాను నవంబర్ నుంచి సెట్స్ మీదకు తీసుకెళ్ళే ఆలోచనలో ఉన్నారు మేకర్స్ .
Also Read :మంచి కబురు చల్లగా చెప్పిన కార్తికేయ
Creative director @aryasukku to produce Young Hero @ActorKartikeya's next under @SukumarWritings 🔥
Story-Screenplay-Dialogues by #Sukumar ⚡️
Stay Tuned for more Official updates… pic.twitter.com/puwdQ6uuNO
— Sukumar Writings (@SukumarWritings) March 12, 2021