రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ సతీతసమేతంగా తిరుమల వేంకటేశ్వర స్వామి వారి సేవలో పాల్గొన్నారు.
రాష్ట్రపతి తిరుమల పర్యటనలో జిల్లా కలెక్టర్ భరత్ కుమార్ గుప్తా కి చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ పర్యటన సమయంలో ఆలయంలోకి వెళ్లేందుకు బయోమెట్రిక్ వద్దకు వెళ్లిన జిల్లా కలెక్టర్ భరత్ కుమార్ ను టీటీడీ విజిలెన్స్ అధికారులు అడ్డుకున్నారు. తాను జిల్లా కలెక్టర్ ని అంటున్నా అనుమతించకపోవడంతో కలెక్టర్ భరత్ గుప్త వెనుదిరగక తప్పలేదు. రాష్ట్రపతి పర్యటనలో ప్రోటోకాల్ పర్యవేక్షణ అధికారినే టీటీడీ విజిలెన్స్ అధికారులు అవమానించడం చర్చనీయాంశం అయింది.
రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడినుంచి తొలుత పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత తిరుమలలో సాంప్రదాయ బద్ధంగా వరాహ స్వామి ని దర్శించుకుని అనంతరం తిరుమలేశుని దర్శనానికి వెళ్లారు. ఆ సమయంలోనే కలెక్టరుకు ఈ పరాభవం ఎదురైంది.
Must Read ;- ఏపీ గవర్నర్ కు రాష్ట్రపతి ఫోన్; కరోనానా వేరే కారణమా?