నాగార్జునసాగర్ అసెంబ్లీతో పాటు ఏపీలో తిరుపతి లోక్సభస్థానాలకు ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇవాళ రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సాగర్ నియోజవర్గ పరిధిలో మొత్తం 2,20,300 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఉప ఎన్నిక జరిగిన పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించాయి. త్రిపురారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బూత్ నెంబర్ 265 లో, గుర్రం పూడ్ మండల కేంద్ర పరిధిలోని వట్టి కోడ్ 13 వ బూతులో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో 7:30 గంటలు దాటిన అక్కడ పోలింగ్ ప్రారంభం కాలేదు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ కుటుంబ సమేతంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. హాలియాలోని ఇబ్రహీంపేటలో ఓటు వేశారు. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో 41 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సాయంత్రం 6 తర్వాత కోవిడ్ రోగులకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు.
Must Read ;- టీఆర్ఎస్లో గుర్తుల టెన్షన్.. సాగర్లో స్వతంత్రుడికి రోడ్డు రోలర్ కేటాయింపు











