మాజీ మంత్రి,, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు చెందిన విజయవాడ సమీపంలోని గొల్లపూడి నివాసానికి సీఐడీ అధికారులు నోటీసులు అంటించారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దేవినేనిపై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 15న పది నిమిషాల్లో కర్నూలు కార్యాలయంలో హాజరు కావాలంటూ మొదట నోటీసులు జారీ చేశారు. దీనిపై మాజీ మంత్రి దేవినేని పది నిమిషాల్లో విజయవాడ నుంచి కర్నూలు ఎలా చేరుకుంటారని విరుచుకుపడ్డారు. తాజాగా ఈ నెల 19న కర్నూలులోని సీఐడీ కార్యాలయంలో హాజరు కావాలని గొల్లపూడిలోని దేవినేని ఉమ నివాసానికి నోటీసులు అంటించారు.
ప్రశ్నిస్తే వేధింపులా..
వైసీపీ నేతల అరాచకాలను ప్రశ్నించినందుకే టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని టీడీపీ నేత దేవినేని ఉమ ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ కేసులకు భయపడేది లేదని దేవినేని స్పష్టం చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో సీఎం అసలు వీడియో మాత్రమే ప్రదర్శించామని దేవినేని తెలిపారు. సీఎం అవినీతి వ్యవహారాలను ప్రశ్నిస్తున్నందుకే అక్రమ కేసులు పెడుతున్నారని దేవినేని మండిపడ్డారు. ఇలాంటి కేసులకు భయపడేది లేదన్నారు.
Must Read ;- టీడీపీ నేతలపై కేసులతో జగన్కు ఆనందం : లోకేష్











