చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. త్వరలో బీజేపీలో చేరనున్నట్లు తన అనుచరులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి చిన్నారెడ్డి పోటీ చేశారు. ఆయనకు ఎలాంటి నష్టం కలగకూడదనే ఉద్దేశంతో ఎన్నికల అనంతరం విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ మార్పు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అప్పట్లో టీఆర్ఎస్లో క్రియాశీలకం..
గతంలో టీఆర్ఎస్ చేవేళ్ల ఎంపీగా పని చేశారు కొండా. టీఆర్ఎస్లో క్రియాశీలకంగా వ్యవహరించారు కూడా. అయితే రంగారెడ్డి జిల్లాకు చెందిన మహేందర్రెడ్డితో ఆధిపత్య పోరు నడిచింది. ఆ విషయమై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. పార్టీ పట్టించుకోకపోవడంతో టీఆర్ఎస్కు విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా చేశారు. కొన్నాళ్లు కాంగ్రెస్లో ఉన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడంతో పార్టీకి పెద్ద షాక్ తగిలినట్లయింది. కొండా రాజీనామాతో రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పట్టు కోల్పోనుంది. అయితే, మూడు నెలల పాటు రాజకీయాలకు దూరంగా ఉంటానన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆ తర్వాత బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
Also Read : పుదుచ్చేరిలో కూలిన కాంగ్రెస్ సర్కార్..











