పుదుచ్చేరిలో అధికారంలో ఉన్న కాంగ్రెస్- డీఎంకే కూటమి విశ్వాస పరీక్షలో విఫలమవడంతో ప్రభుత్వం కూలిపోయింది. మొత్తం 33 మంది సభ్యులున్న పుదుచ్చేరి అసెంబ్లీలో ఆరుగురి రాజీనామాతో 26కి చేరింది. సాధారణ మెజారిటీకి 14 మంది అవసరం కాగా కాంగ్రెస్ సభ్యుల సంఖ్య స్పీకర్తో కలిసి 12కి పడిపోవడంతో నారాయణస్వామి బలపరీక్షలో నెగ్గలేకపోయారు.
బలనిరూపణలో నారాయణస్వామి ప్రభుత్వం విఫలమైనట్లు స్పీకర్ ప్రకటించారు. దీంతో తన పదవికి రాజీనామా చేయనున్నట్లు సీఎం నారాయణస్వామి ప్రకటించారు.ఈ మేరకు రాజీనామా లేఖను లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కు అందజేయనున్నారు. కాగా తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేసిందని, ఎటువంటి నిధులు ఇవ్వకుండా పుదుచ్చేరి ప్రజలకు కేంద్రం ద్రోహం చేసిందని నారాయణ స్వామి ఆరోపించారు.రెండు మూడు నెలల్లో ఇక్కడ ఎన్నికలు జరగనుండటంతో అప్పటి వరకు రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది.
Muist Read ;- కాంగ్రెస్ కు కూన శ్రీశైలం గౌడ్ గుడ్ బై..