ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో మూడు నాలుగు సినిమాల వరకూ ఉన్నాయి. అందులో ‘వకీల్ సాబ్’ మూవీ టాకీ పార్ట్ పూర్తి చేసుకొని విడుదల ముంగిట నిలువగా.. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలోని పీరియాడికల్ ఫిక్షనల్ డ్రామా ‘హరిహర వీరమల్లు’, మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ గా తెరకెక్కుతున్న సినిమాలు రెండూ సెట్స్ మీదున్నాయి. వీటిలో అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ వెర్షన్ కు సంబంధించిన ఓ సూపర్ అప్డేట్ .. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ వెర్షన్ కు త్రివిక్రమ్ స్ర్కీన్ ప్లే డైలాగ్స్ అందిస్తుండగా.. పవర్ స్టార్ పాత్ర కి డైలాగ్స్ కోసం జానపద గీత రచయిత పెంచలదాస్ ను రంగంలోకి దింపుతున్నట్టు వార్తలొస్తున్నాయి. కథ ప్రకారం ఈ సినిమా శ్రీశైలం ఘాట్ రోడ్స్ ప్రాంతంలో ఒక ప్రత్యేక సెట్స్ లో చిత్రీకరణ జరపుకోనుంది. ఇందులో ఒక పోలీస్ స్టేషన్ సెట్, గిరిజన వాడ సెట్ ఉంటాయట. ఒరిజినల్ లో బిజూ మీనన్ పోషించిన అయ్యప్పన్ నాయర్ పాత్రను పవర్ స్టార్ పోషిస్తోన్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగానే తెలుగు వెర్షన్ లో పవర్ స్టార్ పాత్రను డిజైన్ చేశాడట త్రివిక్రమ్ .. అయితే ఆ పాత్ర డైలాగ్స్ కు మాత్రం పెంచల్ దాస్ రాస్తున్నాడట. ఈ ఏడాదిలోనే విడుదల కానున్న ఈ సినిమా మలయాళ వెర్షన్ లాగే సూపర్ హిట్ అవుతుందని ఆశిద్దాం.
Must Read ;- ‘వీరమల్లు’ కోసం పవన్ 3 గెటప్పులు .. 30 కాస్ట్యూమ్స్











