సైబర్ నేరగాళ్లు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పేరున ఆదివారం ట్విటర్లో నకిలీ ఖాతా ప్రారంభించారు.ఆయన చిత్రాన్ని దానికి డీపీగా పెట్టారు.అంతేగాక అది డీజీపీ అధికారిక ఖాతా అంటూ హ్యాండిల్లో పేర్కొన్నారు.దీంతో పలు జిల్లాల ఎస్పీలు,ఇతరులు ఆ ఖాతాను అనుసరించి ట్వీట్లు చేశారు.అయితే అందులో చేసిన కొన్ని ట్వీట్లు అనుమానాస్పదంగా ఉండటంతో నకీలీ ఖాతాగా గుర్తించి ట్విటర్కు ఫిర్యాదు చేసి స్తంభింప చేశారు.దీనిపై విజయవాడలోని సైబర్ నేరాల పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేశారు.ఏ ఐపీ నుంచి ఈ ఖాతా ప్రారంభమయ్యింది,దీనిలో ఎవరి ప్రమేయం ఉందనే దానిపై సైబర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Must Read ;- ఫేక్ ట్విట్టర్ అకౌంట్పై CJI జస్టిస్ ఎన్వీ రమణ ఫిర్యాదు