రైతు భారతం కొనసాగుతుంది.. దేశానికి అన్నం పెట్టే అన్నదాత రెండు నెలలకు పైగా గట్టి కట్టించే చలిని సైతం లెక్కచేయకుండా తమకు అన్యాయం జరిగిందంటూ నినదిస్తున్నాడు. కానీ, ప్రభుత్వం మాత్రం వారిని పట్టించుకోవడం లేదు.. పైగా వారికి ఎవరైనా మద్దతిచ్చినా.. ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేస్తుంది. రైతుల ఆందోళన చూస్తుంటే దేశంలో ప్రజలు నెమ్మదిగా తమ హక్కులను కోల్పోతున్నారా అనే భావన కలుగుతుంది. వారి ఆందోళనలో భాగంగా నేడు ‘చక్కా జామ్’కు పిలుపునిచ్చారు రైతులు.
ఏం చేయనున్నారు?
చక్కా జామ్లో భాగంగా దేశ వ్యాప్తంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 వరకు వాహానాలు రాకపోకల నిలిపివేయాలని కోరుతున్నారు. అంబులెన్స్, స్కూల్ బస్సులతో పాటు పలు అత్యవసర సేవలకు మాత్రం ఇబ్బందులు కలిగించబోమని రైతులు ప్రకటించారు. రహదారుల దిగ్భంధానికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు రైతులు. తమ తరపునుంచి చక్కా జామ్ పూర్తిగా శాంతియుతంగా జరగనున్నట్లు రైతులు వెల్లడించారు. దేశ రాజధాని ప్రాంతానికి మినహాయింపు ఇస్తున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. ఆందోళన ముగియడానికి ఒక్క నిమిషం ముందు రోడ్లపైన నిలిచిపోయిన వాహానాలన్నీ హారన్ కొట్టి రైతులకు సంఘీభావం తెలపాలని రైతులు కోరుతున్నారు.
హై-అలర్ట్..
రైతుల చక్కా జామ్ పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాజధాని సరిహద్దుల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజధాని రోడ్లపై ప్రత్యేక బలగాలను దింపింది ప్రభుత్వం. సరిహద్దుల్లో భారికేడ్లు ఏర్పాటుచేసి ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. రిపబ్లిక్ డే లాగా ఎటువంటి ఆందోళనలకు తావివ్వకూడదనే నేపథ్యంలో తనిఖీలు చేపట్టారు. జాతీయ రహాదారుల్లో, రాష్ట్రాలలో సరిహద్దుల్లో ప్రయాణిస్తున్న ప్రతి వాహానాన్ని పరిశీలిస్తున్నారు. ఉద్వగ్న పరిస్థితులు తలెత్తకూడదనే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Must Read ;- త్వరలో అమరావతి రాజధానికి తికాయత్











