కొన్ని సందర్భాల్లో ఒక్క ట్వీటు చాలు.. ఒక చర్చకు తెరతీయడానికి.. అంతర్జాతీయంగా తన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న పాప్ సింగర్ ఒకరు.. పర్యావరణంపై ప్రేమతో ప్రపంచ నేతలనే ప్రశ్నించి, నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయినా చిన్నారి మరొకరు. వీరి ఇరువురికి ఏమిటబ్బా సంబంధం అనుకుంటున్నారా? వారు ఒక దేశస్థుల కారు.. కానీ వారిరువురు ఒకే అంశంపై చేసిన ట్వీట్లు.. మన భారతీయ రైతు అంశం అంతర్జాతీయంగా చర్చానీయాంశం అవడానికి కారణమైంది. అంతేకాదు.. భారత ప్రభుత్వం ఏకంగా ట్విట్టర్కు నోటీసులు ఇచ్చే స్థాయికి చేరింది గొడవ.
అసలేం జరిగింది?
గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన హింస తిరిగి పునరావృతమవకూడదనే ఆలోచనతో ప్రభుత్వం కాస్త కఠిన చర్యలు చేపట్టింది. అందులో భాగంగా, ఇప్పటికే ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. సింఘు, టిక్రి, ఘజీపూర్ ప్రాంతాల్లో మరో రెండు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయనున్నట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇలా ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడమే అంతర్జాతీయంగా సమస్యకు తెరలేపింది. ఇంటర్నెట్ నిలిపివేసి మరీ ఉద్యమాన్ని అణిచివేయాలని ప్రయత్నిస్తున్న ప్రభుత్వం తీరుపై వెలువడినా కధనాలకు అంతర్జాతీయ ప్రముఖుల సైతం భారత ప్రభుత్వ చర్యలను ప్రశ్నించేలా చేసింది.
Must Read ;- ఢిల్లీలో పేలుడు.. అప్రమత్తమైనా భద్రతా బలగాలు..
ఏమన్నారు?
why aren’t we talking about this?! #FarmersProtest https://t.co/obmIlXhK9S
— Rihanna (@rihanna) February 2, 2021
అంతర్జాతీయ పాప్ సింగర్ రైతుల సమస్యలపై తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘మనమెందుకు దీని (రైతుల ఉద్యమం) గురించి మాట్లాడుకోవడం లేదు?’ అంటూ ప్రశ్న సంధించారు.
We stand in solidarity with the #FarmersProtest in India.
https://t.co/tqvR0oHgo0— Greta Thunberg (@GretaThunberg) February 2, 2021
ఇక అతి పిన్న వయసులోనే కాలుష్యం గురించి ప్రశ్నిస్తూ.. ప్రకృతి కాపాడాలంటూ ఎలుగెత్తి చాటుతున్న గ్రెటా థన్బర్గ్ సైతం రైతుల ఉద్యమంపై స్పందించారు. ‘మేము రైతులకు సంఘీభావం తెలుపుతున్నాం’ అంటూ ట్వీట్ చేయడంతో దానిపై ఇంటర్నెషనల్గా చర్చ మొదలైంది. ఇక వీరి బాటలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ మేనకోడలు కూడ స్పందించారు.
Also Read ;- రైతుల దీక్షలోకి అరాచక శక్తులు, ఢిల్లీ ఉద్రిక్తం
కంగనా ఫైర్
https://twitter.com/KanganaTeam/status/1356640083546406913?s=20
రిహనా, గ్రెటా ట్వీట్లపై కంగనా ఘాటుగా స్పందించారు. రిహనా, గ్రెటా ట్వీట్లను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసి.. ‘వారి (రైతుల) గురించి ఎవరూ ఎందుకు మాట్లాడడం లేదంటే.. వారు రైతులు కాదు.. దేశాన్ని విడదీయాలని చూస్తున్న ఉగ్రవాదులు. మేము మా దేశాన్ని మీ లాంటి వాళ్లకు అమ్ముకోవాలనుకోవడం లేదు.’ అంటూ రిహనాపై విరుచుకుపడింది కంగనా.
No fancy activists will talk about genuine environmentalist our own grandma … but they will definitely promote dumb and a spoilt brat @GretaThunberg who is being used by entire left lobby and in return she gets to skip her education and school. https://t.co/vbN5yJt897
— Kangana Ranaut (@KanganaTeam) February 3, 2021
ఓ 105 సంవత్సరాలు ప్రకృతి ప్రేమికురాలైన బామ్మగారి ఫొటోను షేర్ చేస్తూ..‘ఇలాంటి నిజమైన ప్రకృతి ప్రేమికుల గురించి ఎవరూ మాట్లాడడం లేదు. కేవలం ప్రచారం నిర్వహిస్తూ.. స్కూల్ ఎగ్గొట్టి.. దేశాలు తిరుగుతున్న ఇలాంటి గ్రెటా థన్బర్గ్ గురించి అందరూ మాట్లాడుతున్నారంటూ’ గ్రెటాపైన తన అక్కసు చూపించి కంగనా.
అత్త మీద కోసం దుత్త మీద అన్నట్లు..
#IndiaTogether #IndiaAgainstPropaganda https://t.co/TfdgXfrmNt pic.twitter.com/gRmIaL5Guw
— Randhir Jaiswal (@MEAIndia) February 3, 2021
అంతర్జాతీయంగా చర్చలు రేగడంతో కేంద్రం కాస్త సీరియస్ అయింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక అధికారక లేఖ విడుదల చేసింది. కొందరు కావాలని బాధ్యతరాహిత్యమైన ట్వీట్లు చేస్తున్నారని వ్యాఖ్యనించింది. ట్రాక్టర్ ర్యాలి సమయంలో పోలీసులు చాలా సమన్వయంలో వ్యవహరించారిని తెలిపింది. అంతర్జాతీయ చర్చకు పుల్ స్టాప్ పెట్టాలనే నేపథ్యంలో ఈ లేఖను విడుదల చేసినట్లు తెలుస్తుంది. అంతేనా.. రైతుల సమస్యపై రెచ్చగొట్టే హ్యష్ ట్యాగ్లను ట్విట్టర్ ప్రోత్సహిస్తుందని.. ఐటి నిబంధనలను ట్వట్టర్ ఉల్లంఘించిందని కేంద్రం, ట్వట్టర్కు నోటీసులు జారీ చేసింది. రైతు సంఘాల నాయకుల ట్విట్టర్ ఖాతాలను పునరుద్ధరించాలని కేంద్రం ఆదేశాలు అందకుండానే వారి ఖాతా సర్వీసులను యాక్టివేట్ చేయడంపై కేంద్రం ట్విట్టర్పై సీరియస్ అయింది.
Also Read ;-‘కొత్త చట్టాల’ బంతి రైతుల కోర్టులోకే.. చర్చలకు సిద్ధమన్న మోదీ











