Former Chief Minister Roshaiya Dies Of Heart Attack
అనేక పదవులను అధిరోహించి దిట్ట రోశయ్య…
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య(89) కన్నుమూశారు. బీపీ లో అవ్వడంతో శుక్రవారం తెల్లవారుజామున అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని బంజారాహిల్స్ స్టార్ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ మార్గమధ్యలోనే రోశయ్య తుదిశ్వాస విడిచారు. రోశయ్య 4 జులై 1933న గుంటూరు జిల్లా వేమూరులో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో రోశయ్య విద్యాభ్యాసం కొనసాగించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో కీలక నేతన ఎదిగారు. ఎమ్మెల్యే, ఎమ్మె
ల్సీ, ఎంపీగా రోశయ్య సేవలందించారు. 1968,74,80 లలో శాసన మండలి సభ్యునిగా ఆయన ఎన్నికయ్యారు. మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో రోడ్లు రహదారుల శాఖ, రవాణశాఖా మంత్రిగా పనిచేశారు. 2004 లో చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రోశయ్య విజయం సాధించారు. ఉమ్మడి ఏపీలో ఆర్థిక శాఖా మంత్రిగా పనిచేశారు. ఏడు సార్లు సభలో బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు రోశయ్యకే దక్కుతోంది. దివంగత నేత రాజశేఖ రెడ్డి మరణం తర్వాత, సెప్టెంబర్ 3, 2009 నుంచి జూన్ 25, 2011 వరకూ ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత 2011 ఆగస్ట్ 2016 వరకూ తమిళనాడుకు గవర్నర్ గా రోశయ్య పనిచేశారు.
Former Chief Minister Roshaiya Dies Of Heart Attack
Must Read ;- అంతర్జాతీయంగా భారత్ పరువు తీస్తున్న ఏపీ ప్రభుత్వం!!











