స్కిల్ డెవలప్మెంట్ లో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును మంగళవారం ఆయన సతీమణి నాారా భువనేశ్వరి, బ్రాహణి ములాఖత్ అయ్యారు. వీరితో పాటు మాజీ మంత్రి చినరాజప్ప కూడా బాబును పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్ధితిపై ఆరా తీశారు. అనంతరం బయటకొచ్చిన తరువాత చిన రాజప్ప మీడియాకు చంద్రబాబు అరోగ్య పరిస్ధితిని వివరించారు. కార్యకర్తలు ఎక్కడ మనోధైర్యంగా కొల్పోవద్దు. తన ఆరోగ్యం బాగానే ఉందిని భరోసా ఇచ్చారని చినరాజప్ప మీడియాకు వివరించారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులను ఎంతమందిని అరెస్ట్ చేసినా.. వైసీపీపై పోరాడాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. జనసేన నాయకులను కలుపుకుపోతూ.. నిరంతరం కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఉండాలని కోరారు. అలానే ప్రజా సమస్యలపై.., ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజపక్షం వైపు ఉండి పోరాడాలని దిశా నిర్ధేశం చేశారనన్నారు.
అనంతరం రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై చిన రాజప్ప ధ్వజమెత్తారు. తెలుగు దేశం పార్టీ నాయకులతో ప్రజలు వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. టెర్రరిస్టుల మాదిరిగా తెలుగు దేశం పార్టీ నాయకులను ట్రీట్ చేస్తున్నారని.. ప్రశ్నిస్తే అరెస్ట్ లు చేస్తూ క్రూరంగా వ్యవహరిస్తున్నారన్నారు. జగన్ మెప్పు కోసమో పోలీసులు విక్షణ మరిచి విధులు నిర్వర్తిస్తే.. భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవన్నారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్ట్ వ్యవహారంలో పోలీసులు వ్యవహరించిన తీరు చాలా అమానుషమన్నారు.