హైదరాబాద్ కూకట్ పల్లిలో భారీ దోపిడీ జరిగింది. ఏటీఎంలో డబ్బులు నింపుతున్న వారిపై దుండగుల కాల్పులు జరిపారు. సెక్యూరిటీ గార్డుతోపాటు ఏటీఎం సిబ్బందిపై కాల్పులు జరిపారు. 5 లక్షల డబ్బును దోచుకొని పారిపోయారు. గాయడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంలో సెక్యూరిటీ గార్డు అక్కడికక్కడే చనిపోయాడు. డబ్బులు నింపుతుండగా కాల్పులు జరిపారని సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు. కూకట్పల్లి హెచ్డీఎఫ్సీ ఏటీఎం దగ్గర ఈ ఘటన చోటుచేసుకోవడంతో చుట్టుపక్కలవాళ్లు భయాందోళనకు గురయ్యారు. దోపిడీకి పాల్పడ్డ నిందితుల కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు.
Must Read ;- బెంగాల్ ఎన్నికల్లో హింస.. పోలీసుల కాల్పుల్లో నలుగురు మృతి