సభ నిర్వహణకు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్..!
పాదయాత్ర ముగిసిన తరువాత తిరుపతి ఎస్వీ కళ్యాణ మండపంలో ఈ నెల 17న బహిరంగ సభ నిర్వహించాలని రైతులు సంకల్పించారు. అయితే అధికారులు అనుమతులివ్వలేదు. అయితే తిరుపతిలోని ఓ ప్రైవేటు స్థలంలో సభను నిర్వహించుకోవాలని భావించారు. స్థానిక అర్బన్ పోలీసుల అనుమతులకు వినతులు సమర్పించారు రాజధాని రైతులు. అయితే వివిధ కారణాలు చూపుతూ .. అనుమతులను నిరాకరించారు. దీంతో ఈ నెల 13న అమరావతి పరిరక్షణ జేఏసీ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. రైతుల తరుఫున న్యాయవ్యాదులు లక్ష్మీనారాయణ, పోసాని వెంకటేశ్వర్లు వాదానలు వినిపించారు. కోవిడ్ నిబంధలకు అనుగుణంగా సభకు అనుమతి ఇవ్వాలని న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఈక్రమంలో సభకు అనుమతిస్తే రెండు ప్రాంతాల మధ్య ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందని ప్రభుత్వం తరుపున న్యాయవాది సుధాకర్ రెడ్డి కోర్టుకు తెలిపారు. ఇరు వాదనలను విన్న కోర్టు తిరుపతి సభకు మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 6 వరకు సభ నిర్వహించుకోవాలని ఆదేశించింది.
ఏర్పాట్లలో నిమగ్నమైన రైతులు .. !
హైకోర్టుల అనుమతులతో ఈ నెల 17, శక్రవారం సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లను రైతులు చకచక పూర్తి చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, ఢిల్లీ,హర్యానా రైతు సంఘాలు సభకు హాజరుకానున్నారు. పాదయాత్రలో మద్దతు తెలిపిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సభ వేదికను పంచుకోనున్నట్లు అమరావతి జేఏసీ సభ్యులు వెల్లడించారు.
Must Read ;- ముగిసిన పాదయాత్ర ..! 44 రోజుల్లో రైతులపై పెట్టిన కేసులెన్నో తెలుసా..!!











