భక్తులను శ్రీవారికి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు..!
వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భక్తులను శ్రీవారికి దూరం చేసే ప్రయత్నాలు ముమ్మరమైయ్యాయి. తిరుమల కొండపై అన్యమత ప్రచారం…, చేస్తే తప్పేమిటి? అన్న వాదనలు ఊపందుకున్నాయి. గో హత్యలు పెరిగాయి. అన్యమతస్థులు ఎవరైన కొండపైకి రావచ్చు.. ఏమైన చేసుకోవచ్చు అన్నట్లుగా టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి వ్యవహారి శైలి ఉంది అని ఎప్పటి నుంచో ఆయనపై ఉన్న ఆరోపణలు. సుబ్బారెడ్డి చర్యలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయి. ఏపీ రెవెన్యూ ఎండోమెంట్స్ – 1. జీవో నెంబర్ – 311, రూల్ నెం.16 ప్రకారం హిందువులు కానివారు తప్పనిసరిగా దర్శనానికి ముందు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో తమ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంది. ఇది దశాబ్ధాలుగా కొనసాగుతున్న ఆచారం. కానీ వీటిని ముఖ్యమంత్రి జగన్ రెడ్డే ఎన్నడూ పాటించలేదు అన్నది శ్రీవారి పాదాల సాక్షిగా సత్యం. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలపై 80 పైగా దాడులు, విధ్వంసాలు జరిగాయి. కానీ ఏ ఒక్క కేసుల్లో ఇంతవరకు ఒక్క అరెస్ట్ లేకపోవడం గమనార్హం. తిరుమల ధార్మిక సంస్థను వ్యాపార సంస్థగా మార్చేశారు. టీటీడీ పాలకమండలి ఏ నిర్ణయం తీసుకున్నా పీఠాధిపతులతో చర్చించకుండా తీసుకుంటున్నారు. ఇటువంటి ఆలోచనలు మంచివి కావని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ ఛైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి కొనసాగడం అనర్హుడని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో ఏదో ఒక మూల నిత్యం హిందూధర్మంపై దాడులు జరుగుతునే ఉన్నాయి. వీటిన్నింటిని చూస్తుంటే.. జగన్ రెడ్డి పార్టీ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదని, వైఎస్ఆర్ క్రిస్టియన్ పార్టీ అని స్వామిజీ ధ్వజమెత్తారు.
Must Read ;- కేంద్ర మంత్రుల వ్యాఖ్యలతో రోడ్డునపడ్డ ఏపీ పరువు..! జగన్ చర్యలే కారణాలా?!











