పోలీసు నిరాకరణ .. హైకోర్టును ఆశ్రయించిన రాజధాని రైతులు!
రైతులు ఏపీ రాజధాని అమరావతేనని రెండు సంవత్సరాలుగా చేస్తున్న నిరసనలు మహాపాదయాత్రకు దారితీసింది. డిసెంబర్ 17తో రెండు సంవత్సరాలను పూర్తి చేసుకుని మూడే ఏడాదిలోకి రైతు పోరాటం అడుగుడు పెడుతున్న నేపధ్యంలో తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని సంకల్పించారు. కానీ పోలీసులు అనేక కారణాలు లేవనెత్తి రైతులు విజ్ఞప్తులను తోసిపుచ్చారు. అనుమతులను నిరాకరిస్తూ .. తిరపతి అర్భన్ పోలీసులు రైతులకు లేఖ రాశారు. పోలీసులు, అధికారుల తీరును నిరసిస్తూ .. అనుమతుల కొరకు రైతులు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అమరావతి పరిరక్షణ సమితి రిట్ పిటిషన్ సోమవారం దాఖలు చేసింది. సభను ప్రభుత్వం కావాలనే ఉద్దేశపూర్వకంగా అడ్డుపడుతోందని రైతుల తరుఫు న్యాయవ్యాది లక్ష్మీనారాయణ పిటిషన్ లో పేర్కొన్నారు.
అర్బన్ ఎస్పీ ఏం చేస్తున్నారు .. !
నవంబర్ 1 న ఏపీ రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు ‘న్యాయంస్థానం టూ దేవస్థానం’ పేరుతో మహాపాదయాత్రను తుళ్లూరు నుంచి ప్రారంభించింది. నాటి నుంచి నేటి వరకు పాదయాత్ర గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల మీదిగా చిత్తూరు చేరుకుంది. 16న తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుపతి లో 17న భారీ బహిరంగ సభ నిర్వహించాలని రైతులు భావించారు. అయితే, డీఎస్పీ స్థాయి అధికారి రైతుల వినతులను నిరాకరించారు. ఈ క్రమంలోనే రైతుల తరుఫున న్యాయవ్యాది లక్ష్మీనారాయణ స్పందించారు. ఎస్పీ స్థాయి అధికారి అనుమతులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా .. డీఎస్పీ ఎలా నిర్ణయం తీసుకుంటారని అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా అమరావతి రైతుల పిటిషన్ పై మంగళవారం విచారణ జరిగే అవకాశం ఉంది.
Must Read ;- కేంద్ర మంత్రుల వ్యాఖ్యలతో రోడ్డునపడ్డ ఏపీ పరువు..! జగన్ చర్యలే కారణాలా?!