మాజీ ముఖ్యమంత్రి,, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి నారాయణలపై సీఐడీ నమోదు చేసిన కేసుల విషయంలో మరో మూడు వారాల పాటు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఇవాళ ఆదేశించింది. సీఐడీ పెట్టిన కేసుల విచాణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు. ఈ నెల 20న సీఐడీ కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అప్పటి నుంచి మూడు వారాల పాటు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. కేసు విచారణను ధర్మాసనం ఈ నెల 20 తేదీకి వాయిదా వేసింది.
ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదన్నా..
అమరావతిలో అసైన్డు భూముల విషయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అప్పటి పురపాలక శాఖా మంత్రి నారాయణలపై సీఐడీ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అమరావతి రాజధాని భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని హైకోర్టు ఇప్పటికే తీర్పు వెలువరించినా సీఐడీ కేసులు నమోదు చేసింది. మా వద్ద ఆధారాలు ఉన్నాయంటూ చంద్రబాబు, నారాయణపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో మరో మూడు వారాలు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు తాజాగా సీఐడీ అధికారులను ఆదేశించింది.
Must Read ;- ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు.. చంద్రబాబుపై అట్రాసిటీ కేసు