కొడాలి నాని వేసిన పిటిషన్ పై విచారణ జరిపింది కోర్టు. మీడియాతో మాట్లాడకూడదని ఎస్ ఈసీ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేస్తూ.. నానికి కొన్ని నిబంధనలను విధించింది. నాని మీడియాతో మాట్లాడడానికి అనుమతులిచ్చింది. కానీ, ఎన్నికల కమిషన్పై వ్యాఖ్యలు చేయకూడదని హైకోర్టు ఆదేశించింది.
ఈ నెల 21 వరకు నాని మీడియాతో మాట్లాడకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. వాటిని రద్దుచేయాలంటూ కోర్టును ఆశ్రయించిన నానికి మీడియాతో మాట్లాడే అనుమతులు లభించినా.. ఎన్నికల కమిషన్ పైన గానీ, కమిషనర్ పైన గానీ వ్యాఖ్యలు చేయడానికి కోర్టు అనుమతులు ఇవ్వలేదు. దీని వల్ల నాని నోరు కట్టేసి నట్లైంది. ఇక పై ఎన్నికల కమిషన్ గురించి నోరెత్తడానికి తేదని కోర్టు తేల్చి చెప్పింది.
Must Read ;- మంత్రి కొడాలి నానిపై కేసు నమోదుకు ఎస్ఈసీ ఆదేశం