ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినందుకు మంత్రి కొడాలి నానిపై ఐపీసీ 504, 505(1) 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కృష్ణా జిల్లా ఎస్పీని ఆదేశించారు. మంత్రి కొడాలి నాని ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు క్లాజ్ 1, క్లాజ్ 4 కింద కేసు నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చర్యలు తీసుకోవాలని ఎస్పీకి రాసిన లేఖలో ఎస్ఈసీ స్పష్టం చేశారు. కోడ్ ఉల్లంఘించడంతోపాటు బెదిరించే విధంగా వ్యాఖ్యలు చేయడం, కించపరచడం వంటి సెక్షన్ల కింద మంత్రిపై కేసులు నమోదు చేయాలని ఎస్పీకి పంపిన లేఖలో ఎస్ఈసీ పేర్కొన్నారు.
కొడాలిపై ఎస్ఈసీ సీరియస్
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్పై మంత్రి కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకుంది. శుక్రవారం నాడు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, మీడియా అధినేతలను మంత్రి కొడాలి నాని తిట్టిపోసిన సంగతి తెలిసిందే. దీనిపై ఎస్ఈసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మంత్రి కొడాలి నాని తన న్యాయవాది చిరంజీవి ద్వారా వివరణ ఇప్పించారు. మంత్రి వివరణతో ఎస్ఈసీ సంతృప్తి చెందలేదు. వివరణ ఇచ్చిన అనంతరం మంత్రి కొడాలి నాని తరఫు న్యాయవాది చిరంజీవి చేసిన వ్యాఖ్యలు కూడా అభ్యంతరకరంగా ఉన్నాయని ఎస్ఈసీ గుర్తించింది. దీంతో మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీని ఆదేశించింది.
Must Read ;- ఏకగ్రీవాలు విత్ హెల్డ్.. ఫిర్యాదులపై ఎస్ఈసీ విచారణ