అందాల ఆరబోతతో కుర్రకారును ఉర్రూతలూగిస్తున్న బుట్టబొమ్మ పూజా హెగ్డే మరోసారి యువతను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన రంగస్థలం సినిమాలో జిగేలు రాణి గా అదిరే స్టెప్పులు, అందాల ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ అమ్మడు మరోసారి ఐటం సాంగ్ తో అందరినీ ఆకర్షించబోతున్నట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిస్తున్న హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ ‘ఎఫ్ 3’ మూవీలో ఈ ఇద్దరితో కలిసి పూజా స్టెప్పులు వేయబోతోందట. తమన్నా, మెహరీన్, సోనాల చౌహాన్ హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ చిత్రం మే 27 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే సినిమాకి మరింత గ్లామర్ డోస్ పెంచేందుకు దర్శకుడు అనిల్ రావిపూడి బుట్టబొమ్మతో ఈ ప్రత్యేక సాంగ్ ని ప్లాన్ చేశారని సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్. కాగా ఈ స్పెషల్ సాంగ్ కోసం పూజా హెగ్డే దాదాపు 1 కోటి రూపాయల పారితోషికం అందుకున్నట్టు సమాచారం.గతంలో ఈ బ్యూటీ చేసిన ‘రంగస్థలం’ చిత్రంలోని జిగేల్ రాణి సాంగ్ సూపర్ హిట్ అవడంతో పాటు ఒక ఊపు ఊపింది. ఈ క్రమంలోనే “ఎఫ్ 3” కోసం ఆమె డిమాండ్ చేసిన మొత్తాన్ని ఇవ్వడానికి నిర్మాతలు అంగీకరించారట. ఇక ఈ పాట కూడా అదే స్థాయిలో సూపర్ హిట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సాంగ్ చిత్రీకరణ కోసం హైదరాబాద్ లో భారీ సెట్ కూడా వేయబోతున్నారట. ఇప్పటికే వరుస ప్రాజెక్టులతో ఫుల్ స్వింగ్ లో ఉన్న పూజా మరోసారి ఐటం సాంగ్ లో నటించేందుకు సై అంటోంది.మరి ఈసారి ఐటం బ్యూటీగా పూజా ఎలా అలరించబోతోంది అనేది చూడాలి. ఇక ఎఫ్ 3 కి సంబంధించి దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండడం విశేషం.
ఓటుతో కొట్టినా బుద్ధి మారలేదు.. అమరావతిపై జగన్ విషం
ఎన్నికల్లో ప్రజలు మూతి మీద కొట్టినట్లు జవాబిచ్చినా వైసీపీ అధినేత జగన్ తీరు...