IIT Delhi Alumnus Neeraj Chaudhary Climbs Mount Everest With in 7 Weeks After Covid Recovery :
ప్రతి మౌంటెనీర్ ఎవరెస్ట్ ను అధిరోహించాలని కలలు కంటారు. కానీ చాలామందికి సాధ్యం కాదు. అనుకూలించని వాతావరణం.. పడిపోయే ఆక్షిజన్ నిల్వలు.. విరుచుకుపడే మంచు శిలలు.. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఎవరెస్ట్ ఎక్కాలంటే.. శారీరకంగా, మానసికంగా ధైర్యంగా ఉంటేనే సాధ్యం. రాజస్థాన్ కు చెందిన ఓ వ్యక్తి కరోనా బారిన పడ్డి.. మహమ్మారి నుంచి కోలుకోని ఎవరెస్ట్ ను అధిరోహించాడంటే అంటే ఎవరైనా నమ్ముతారా.. కానీ ఇతడు అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు.
కరోనా బారిన పడి…
రాజస్థాన్కు చెందిన నీరజ్ చౌదరి (37) చిన్నప్పట్నుంచే పర్వతారోహణ అంటే చాలా ఇష్టం. ఒకవైపు చదువుకుంటూనే.. మరోవైపు మౌంటెనీర్ గా శిక్షణ తీసుకున్నాడు. ఢిల్లీ ఐఐటీలో పర్యావరణ శాస్త్రంలో ఎంటెక్ పూర్తి చేశాడు. రాజస్థాన్ ప్రభుత్వ జలవ నరుల విభాగంలో ఉద్యోగం చేస్తున్నాడు. మార్చి 27న నీరజ్తో పాటు మరికొందరు ఎవరెస్ట్ ను అధిరోహించేందుకు నేపాల్లోని ఖట్మాండూకు వెళ్లారు. బేస్ క్యాంప్ వద్ద నిర్వహించిన కరోనా పరీక్షల్లో నీరజ్కు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఎవరెస్ట్ అధిరోహణను విరమించుకుంటున్నారు. కానీ నీరజ్ ఏడు వారాల్లోనే కరోనాను జయించి, ఎవరెస్ట్ కు సిద్ధమయ్యాడు. మే 31న ఎవరెస్ట్ ను అధిరోహించి.. భారత జెండాను ఎగురవేశాడు.
Must Read ;- చరిత్ర పుటల్లోకి తెలుగు యువతి.. నేడే రికార్డు జర్నీ షురూ











