Corona Update In India :
దేశంలో వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తోంది. పాజిటివ్ కేసులు క్రమక్రమంగా తగ్గుతున్నాయి. కేసులే కాదు.. మరణాలు కూడా చాలా సంఖ్యలో నమోదువుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ ముగుస్తుందడానికి తాజా కేసులే నిదర్శనంగా నిలవనున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య భారీగా పడిపోవడంతో ప్రజలు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఏ ఇబ్బందులు లేకుండా రోజువారి పనులు, వ్యాపార కార్యకాలపాలను కొనసాగిస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకుంటూ.. కనీస జాగ్రత్తలు పాటిస్తూ మహమ్మారికి దూరంగా ఉంటున్నారు. అన్ని రకాల వ్యాపార సముదాయాలు, దుకాణాలు, షాపులు, సినిమా హాళ్లు, బార్లు, పబ్బులు తెరుచుకోవడంతో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది.
30 వేల లోపే..
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 29,689 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,14,40,951కు చేరింది. నిన్న 42,363 మంది కోలుకున్నారు. 415 మంది కరోనాతో చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,21,382కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,06,21,469 మంది కోలుకున్నారు. 3,98,100 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు మొత్తం 44,19,12,395 వ్యాక్సిన్ డోసులు వేశారు. దాదాపు 132 రోజుల తర్వాత కరోనా కేసులు భారీగా తగ్గాయని వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
Must Read ;- పిల్లులూ దాడి చేస్తాయ్ .. యాంటీ రబీస్ వ్యాక్సిన్ తీసుకోవడం శ్రేయస్కరం
#Unite2FightCorona #COVID19 FLASH
India reports less than 30,000 daily cases after 132 days; 29,689 new cases in last 24 hours.
India's Active Caseload less than 4,00,000 after 124 days; currently at 3,98,100.
Active cases constitute 1.27% of total cases.@PMOIndia
— Ministry of Health (@MoHFW_INDIA) July 27, 2021