బుల్లితెర స్టార్ కమెడియన్ గా ఒక వెలుగు వెలుగుతున్నాడు సుడిగాలి సుధీర్. “జబర్దస్త్” కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుధీర్. కొన్ని సినిమాల్లో కూడా యాక్ట్ చేసి సత్తా చాటుకున్నాడు. ఎప్పుడూ సుధీర్ చుట్టూ అనేక వార్తలు చక్కెర్లు కొడుతుంటాయి. రష్మీతో ఎఫైర్ గురించి చాలా మంది అభిమానులు సోషల్ మీడియా ద్వారా అడుగుతుంటారు. ఆ రూమర్లలో నిజం లేదని ఎప్పటికప్పుడు సుధీర్ వివరణ ఇస్తాడు కూడా.
ఇప్పుడు తాజాగా సుధీర్ పై మరో వార్త హల్ చల్ చేస్తుంది. అదేమిటంటే ఈ మధ్య సుధీర్ కరోనా బారిన పడినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన కరోనా బారిన పడి ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నాడని తెలుస్తుంది. డాక్టర్ల సలహా మేరకు హోమ్ క్వారంటైన్ లో ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం సుధీర్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలుస్తుంది. సుధీర్ కు కరోనా పాజిటివ్ రావడంతో తన కుటుంబం మొత్తానికి కరోనా టెస్టులు చేయించారని, వారికి మాత్రం నెగిటివ్ వచ్చిందని టాక్ నడుస్తోంది.
ఈ వార్తపై పలువురు అభిమానులు స్పందించారు. సుధీర్ త్వరగా కోలుకోవాలని వారు కోరుకున్నట్లు తెలిపారు. సుధీర్ పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చి మమ్మల్ని నవ్వించాలని వారు కోరుతున్నారు. ఈ వార్తపై సుధీర్ కాని ఆయన కుటుంబం కాని ఆయన సన్నిహితులు కాని స్పందించకపోవడం విశేషం. ప్రస్తుతం పలు సినిమాలకు, టీవీ షోలకు కమిట్ అయిన సుధీర్ త్వరగా కోలుకొని మళ్ళీ ప్రేక్షకులను ఆనందింపచెయ్యాలని కోరుకుందాం.











