ఏపీలో మొన్నటి దాకా టామ్ & జెర్రీ రేంజ్లో ఆరోపణలు, ప్రత్యారోపణలతో అభిమానుల్లో గందరగోళాన్ని సృష్టించిన జనసేన-బీజేపీ.. హఠాత్తుగా చేతులు పట్టుకుని చెట్టాపట్టాలేసుకుని తిరగడం మొదలుపెట్టారు. నిన్నటికి నిన్న మీడియా ముందుకొచ్చి.. మేమంతా ఒక్కటే అని ప్రకటించిన వెంటనే, ఇరు పార్టీలు కలిసి గవర్నర్ని కలిసి పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా జరపాలని విజప్తి చేశారు.
ప్రభుత్వ ఒత్తిళ్లకు అడ్డుకట్టవేయండి..
ప్రభుత్వం ఒత్తిడి చేసి ఎలక్షన్లు లేకుండా ఏకగ్రీవం చేసే ఏర్పాట్లు చేస్తుందని.. కావున, ఆన్ లైన్లో నామినేషన్ల ప్రక్రియకు అనుమతులు ఇవ్వాలని గవర్నర్ని కోరారు. ఎలక్షన్లలో ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరించేలా చూడాలని కోరినట్లు సమాచారం. ప్రభుత్వం కొత్త రాజ్యంగాన్ని పునికిపుచ్చుకుని ప్రతిపక్షాలపై కేసులు పెడుతోంది. కోర్టులు వాటిని అంగీకరించకపోయినా సరే.. పట్టించుకోకుండా తప్పుడు కేసులు పెడ్తున్నారని బీజేపీ నాయకుడు సోమువీర్రాజు ఆరోపించారు. ఆలయాల దాడుల్లో బీజేపీ పాత్ర ఉందని చెప్పడం దారుణం. వైసీపీ మత రాజకీయాలు చేస్తుందని సోమువీర్రాజు ప్రభుత్వ చర్యలను తప్పుబట్టారు.
Must Read ;- మేమూ.. మేమూ.. ఒక్కటే..