పంచాయతీ ఎన్నకలపై బీజేపీ, జనసేన తమ డిమాండ్లను వినిపించారు. ఆన్ లైన్ నామినేషన్లు 29 లోపే మొదలుపెట్టాలని సోమువీర్రాజు డిమాండు చేశారు. ఏకగ్రీవాల కోసం వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అందువల్ల ఇతర పార్టీల అభ్యర్ధులకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికల్లో సరైన సభ్యలను ఎన్నుకున్నప్పడే అభివృద్ధి సాధ్యమవుతుందని జనసేన చెప్పుకొచ్చింది. గ్రామాలు అభివృద్ధి చెందినపుడే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. కానీ, అధికార తమ పార్టీ అభ్యర్ధులను ఏకగ్రీవంగా ఎన్నకునేలా చేయడానికి ప్రయత్నిస్తుందని ఇరు పార్టీలు చెప్తున్నారు. పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కోరుతున్నట్లు చెప్పుకొచ్చారు.
జనసేన, బీజేపీల మధ్య ఎటువంటి అపార్థాలకు తావు లేదని ఇరు పార్టీ వర్గాలు మీడియా సముఖంలో ప్రకటన విడుదల చేశారు. తిరుపతి ఉప ఎన్నకలలో ఇరు పార్టీలు కలిసి పనిచేస్తున్నట్లు ప్రకటించారు.
Must Read ;- జనసేనాని పవన్తో బీజేపీ రథసారధి సోము వీర్రాజు భేటీ