ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్ తమ పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ప్రతి జిల్లాకు మంత్రులను ఇన్ ఛార్జీలుగా నియమించారు. నిమోజకవర్గం బాధ్యత ఎమ్మెల్యేకు అప్పగించారు. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదనీ. న్యాయవాదుల కోసం, గ్రాడ్యుయేట్ ల కోసం కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు.
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు మోడీ.. ఎక్కడ ఇస్తు్న్నారు ఉద్యోగాలంటూ బీజేపీ వైఫల్యాలను ఎత్తి చూపారు. పీవీ వాణి మంచి విద్యావేత్త.. తనకు మద్దతు తెలపాలని కేటీఆర్ కోరారు. ‘ఉద్యోగాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం సంచలనం సృష్టించింది. హోంగార్డులు, అంగన్వాడి.. ఇలా ఉద్యోగల జీతాలు పెంచాము. చిరు ఉద్యోగుల జీవితాల్లో వెలుగు నింపిన ఘనత మా ప్రభుత్వానిదే. ఈ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు బీజేపీ లేదు. ఐటిఐఆర్ ను జీజేపీ రద్దు చేసింది. దాని వల్ల తెలంగాణ యువత ఎందరికో ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయి. అటువంటి బీజేపీ ఓటు అడిగే హక్కు లేదు’ అంటూ కేటీఆర్ ఎమ్మెల్సీ సన్నాహక సమావేశాల్లో వ్యాఖ్యానించారు.
Must Read ;- ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్లు.. బరిలో చాలామంది