పెనుమూరు మండలం తూర్పుపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి కూడా చేసుకున్న ఓ యువకుడు.. తదనంతర పరిణామాల్లో ఆమెను దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు. నడిరోడ్డుపై అటకాయించి ఏకంగా 15కత్తిపోట్లు పొడవడంతో ఆమె మరణించింది. ప్రేమించిన యువతిని ఢిల్లీ బాబు అనే యువకుడు నడిరోడ్డుపై దారుణంగా కత్తితో నరికిన దుర్ఘటన ఇది.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
పూతలపట్టు మండలం చింతమాకుల పల్లి గ్రామానికి చెందిన ఢిల్లీ బాబు (19), గాయత్రి (18)ల మధ్య రెండేళ్లుగా ప్రేమాయణం నడుస్తోంది. రెండు నెలల కిందట వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. గాయత్రి మైనర్ కావడంతో పెళ్లి చెల్లదని చెప్పి, పోలీసులు ఆ ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి వారి వారి ఇళ్లకు పంపారు.
పోలీసుల మందలింపుతో గాయత్రి మనసు మార్చుకుని ఢిల్లీ బాబు ను దూరం పెట్టింది. దీంతో కినుక వహించిన ఢల్లీబాబు, గాయత్రి ప్రవర్తన నచ్చక ఈ ఉదయం రోడ్డుపై కాపు కాచి మరీ కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. కత్తి పోట్లతో గాయత్రి రోడ్డుపై కుప్పకూలిపోయింది.
పరిస్థితి విషమించడంతో ఆమెను హుటాహుటిన చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె అక్కడ మరణించింది.
Must Read ;- పెళ్లికి నో అన్న ప్రియుణ్ని.. పొడిచి చంపిన పావని











