అమ్మాయి బాగుంది సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మలయాళ ముద్దుగుమ్మ మీరాజాస్మిన్. ఆతర్వాత భద్ర సినిమాలో రవితేజ సరసన నటించింది. సక్సస్ సాధించి మంచి పేరు తెచ్చుకుంది. ఆతర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన గుడుంబా శంకర్ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాతో మీరాజాస్మిన్ బాగా పాపులర్ అయ్యింది. అయితే.. పెళ్లి చేసుకున్న తర్వాత మీరా జాస్మిన్ సినిమాలకు దూరమైంది. మళ్లీ ఇప్పుడు సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.
ఇటీవల తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు చూసిన ఫిల్మ్ మేకర్స్ మీరాజాస్మినేనా అంటూ షాక్ అయ్యారని చెప్పచ్చు. అప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడు అలానే ఉంది. అందుకనే ఆమెతో సినిమాలు చేసేందుకు.. కీలక పాత్రలు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. అసలు విషయం ఏంటంటే.. ఎనర్జిటిక్ హీరో రామ్ తో ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఓ భారీ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.
ఈ సినిమాలో కీలక పాత్ర కోసం దర్శకుడు బోయపాటి మీరాజాస్మిన్ ని కాంటాక్ట్ చేశారని.. ఆమె ఈ సినిమాలో నటించడం కన్ ఫర్మ్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే.. లక్కీ ఛాన్స్ దక్కించుకున్నట్టే. మరి.. ఈ మలయాళ ముద్దుగుమ్మ రీ ఎంట్రీలో వరుసగా అవకాశాలు దక్కించుకుని మళ్లీ బిజీ అవుతుందేమో చూడాలి.