మయన్మార్ దేశం తిరిగి సైనికుల కబంద హస్తాలలో చిక్కుకుంది. దాదాపు 50 ఏళ్లగా సైనిక చేతులలో మగ్గిన మయన్మార్ స్వేచ్ఛా వాయువులు సంబరం మూణ్ణాళ్ల ముచ్చటగా మారింది. 2015 ఎలక్షన్లలో అత్యుత్తమ మెజారిజీతో గెలిచి చరిత్ర సృష్టించిన సూకీ.. అధ్యక్షురాలిగా పదవి చేపట్టారు. ఎన్నికల అనంతం ప్రభుత్వానికి, మిలిటరీకి సంక్షోభం తలెత్తడంతో.. సైనికుల తిరుగుబాటు జెండా ఎగరేశారు. మయన్మార్ ప్రధాన నగరమైన యంగోన్ సిటీ హాల్ బయట సైనికులు మోహరించారు.
సూకీతో పాటు, ప్రభుత్వంలోని మిగిలిన అధికారులను అదుపులోకి తీసుకుని ఏడాది పాటు ఎమర్జెన్సీ ప్రకటించారు. దేశమంతటా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. దీనివల్ల మొబైల్ నెట్ వర్క్లు కూడా పనిచేయడం మానేశాయి. మయన్మార్లో సైనిక చర్యలను ప్రపంచ దేశాలు ఖండిస్తున్నారు. వెంటనే దేశానికి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని మయన్మార్ సైనికులను హెచ్చరిస్తున్నాయి.
Must Read ;- ప్రజాస్వామ్యంపై దాడికి 19 ఏళ్లు










