(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా సోమవారం శృంగవరపుకోటలోని ఒక ప్రైవేటు పాఠశాల నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే కడుబండి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి పరిపాలన అందించగలిగిన ఏకైక నాయకుడు భారతదేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే వై.ఎస్. జగన్మోహన్రెడ్డి గారని అనడం, తన చుట్టూ ఉన్నా వైసీపీ నాయకులు అది గమనించకుండా చప్పట్లు కొట్టడం హాస్యాస్పదంగా వైరల్ అయింది.
ఫ్లోలో పొరపాటు జరిగింది
ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మంగళవారం కొత్తవలసలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మీడియా ముఖంగా వివరణ ఇచ్చారు. తన ప్రసంగం ఫ్లోలో పొరపాటు జరిగిందని, అవినీతి రహిత పరిపాలన అందించగలిగిన ఏకైక నాయకుడు భారతదేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే వై.ఎస్. జగన్మోహన్రెడ్డి గారనే చెప్పే ఉద్దేశంతో ప్రసంగించానని అన్నారు.
ఎమ్మెల్యే కడుబండి ప్రసంగించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండటంతో రాష్ట్ర అధికార, విపక్ష నాయకులు ఈ అంశంపై వివిధ రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు.
Must Read ;- ఆ గుండెలు జె టాక్స్.. జె టాక్స్ అంటూ కొట్టుకుంటున్నాయ్!











