అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుపై ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్ పనికిమాలినోడు అంటూ కేతిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను కూడా కలెక్టర్ గంధం చంద్రుడు లెక్కచేయడం లేదని విరుచుకుపడ్డారు. ఇవాళ ఉండి రేపు పోతాడని, ఎవడిని నాశనం చేయడానికి వచ్చాడంటూ కేతిరెడ్డి ధ్వజమెత్తారు. ఒక జిల్లా మెజిస్ట్రేటుపై ప్రజాప్రతినిధులు ఈ స్థాయిలో విరుచుకుపడటం ఈ మధ్యకాలంలో ఇదేనని చెప్పవచ్చు.
ఒక ఇగోయిస్టు..
అనంతపురం జిల్లా కలెక్టర్ గందం చంద్రుడు ఒక ఇగోయిస్టు అంటూ కేతిరెడ్డి విమర్శించారు.పత్రికల్లో హనీట్రాప్ రాకపోతే ఎప్పుడో పోయేవాడని చెప్పుకొచ్చారు. కలెక్టర్ కులాల మధ్య చిచ్చురేపే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. కలెక్టర్ వ్యవహార శైలిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డికి చెప్పినా ప్రయోజనం లేకుండా పోయిందని కేతిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ గంధం చంద్రుడు సీఎంవోకు తప్పుడు ఫీడ్ బ్యాక్ ఇస్తున్నాడని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. గంధం చంద్రుడు చేసిన పనికిమాలిన పనులు చెప్పాలంటే పేజీలు చాలవని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.
Must Read ;- దౌర్జన్యాలు ఆపకపోతే ప్రజలు తిరగబడతారు.. వైసీపీ నాయకులకు బాలకృష్ణ హెచ్చరిక











