నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అనారోగ్యంతో కన్నుమూశారు. టీఆర్ఎస్కు చెందిన ఈ నాయకుడు.. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మంగళవారం ఉదయం కన్నుమూశారు.
1999, 2004లో రెండుసార్లు సీపీఎం తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన నోముల, 2009 ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. 2013లో టీఆర్ఎస్ లో చేరారు. 2014లో నాగార్జున సాగార్ నుంచి బరిలో దిగి జానా రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో జానారెడ్డి మీదనే విజయం సాధించి ఎమ్మెల్యే అయ్యారు.
1956 జనవరి 9న నల్గొండ జిల్లా నకిరేకల్ సమీపంలోని పాలెం గ్రామంలో నోముల జన్మించారు. ఆయన వయస్సు 64 ఏళ్లు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ, ఎల్ఎల్బి చదివారు. చిన్నతనం నుంచి విప్లవసాహిత్యం మీది మక్కువతో కమ్యూనిస్టు పార్టీల పట్ల ఆకర్షితులయ్యారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా పనిచేశారు. చిన్న తనం నుంచి ఆయనకు వ్యవసాయం అంటే ఎక్కువ ఇష్టం.
విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయన రాజకీయ రంగప్రవేశం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలోనే ఎస్ఎఫ్ఐ నాయకుడిగా పనిచేసేవారు. అనంతరం ఆయన కమ్యూనిస్టు పార్టీలో చేరారు. నల్గొండలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. రెండు సార్లు నకిరేకల్ మండల అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నకిరేరకల్ నుంచే రెండుసార్లు సీపీఎం తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. తెరాసలో చేరిన తర్వాత ఆయన నియోజకవర్గం మారవలసి వచ్చింది. నకిరేకల్ నుంచి నాగార్జున సాగర్ కు మారి.. మొదటిసారి ఓడిపోయినా.. 2018లో గెలిచారు.
ఆయన మృతిపట్ల పలువురు నాయకులు తమ సంతాపం వ్యక్తం చేశారు.
నోముల నర్సింహయ్య జీవితం ఇదీ (సంక్షిప్త వివరాలు) :
మంగమ్మ, నోముల రాములు ల ఐదుగురి సంతానంలో నోముల నర్సింహ్మయ్య రెండవ వారు. ఆయన తోబుట్టువులందరూ ఉన్నత చదువులు చదివిన వారే కావడం విశేషం. ఆయనకు భార్య లక్ష్మీ, ఇద్దరు కుమార్తెలు రాణి, అరుణ జ్యోతి. ఇద్దరూ వివాహితులు ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. ఒక కొడుకు నోముల భగత్ కుమార్, హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్నారు.
న్యాయవాది గా మంచి గుర్తింపు ఉన్న నోముల నర్సింహయ్య, సీపీఎం సీనియర్ నేత నర్రా రాఘవరెడ్డి ప్రోత్సాహంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 1987, 1999 వరకు 12 ఏళ్ల పాటు నకిరేకల్ ఎంపీపీగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 1999, 2004 లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి సీపీఎం తరుపున ఎమ్మెల్యేగా విజయంసాధించి, సీపీఎం శాసనసభా పక్ష నేతగా కూడా విధులు నిర్వర్తించారు. 2009లో రిజర్వేషన్ మారడంతో అప్పుడే ఏర్పడిన భువనగిరి లోక్ సభ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల సమయంలో సీపీఎం నుంచి హుజూర్ నగర్ సీటు కోసం ప్రయత్నించారు. సీపీఎం నుంచి టికెట్ రాకపోవడంతో టిఆర్ఎస్ లో చేరి నాగార్జునసాగర్ టికెట్ దక్కించుకున్నారు. 2018 ఎన్నికల్లో తిరిగి పోటీ చేసి జానారెడ్డి విజయయాత్ర కు చెక్ పెడుతూ అనూహ్య విజయం సాధించారు.
Also Read: ghmc elections trs bjp