చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్బాబు మధ్య మంచి స్నేహబంధం ఉంది. గతంలో వారిద్దరూ కలసి పలు చిత్రాలలో నటించిన సంగతి తెలిసిందే. అడపాదడపా వీరిద్దరూ కలుసుకుని ఆప్యాయంగా మాట్లాడుకుంటుంటారు. ఈ నేపథ్యంలో బుధవారం మోహన్బాబు ‘ఆచార్య’ సెట్స్ కు స్నేహపూర్వకంగా వెళ్లారు. చిరంజీవికి శుభాకాంక్షలు చెబుతూ బొకే ఇచ్చి పలకరించారు. తన సినిమా సెట్ కు వచ్చిన మోహన్బాబును సాదరంగా ఆహ్వానించిన చిరంజీవి కొద్దిసేపు సినిమాలతో పాటు వివిధ అంశాలపై ముచ్చటించారు. ఇదిలావుండగా.. మోహన్ బాబు తాజాగా ‘సన్ ఆఫ్ ఇండియా’ అనే చిత్రం చేస్తున్నారు.
Must Read ;- యంగ్ చెస్ ట్రైనర్ గా మోహన్ బాబు మనవరాలు రికార్డ్